Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..
- బాబ్రీని పునర్నిర్మించలేరు, వారి కలలు నిజం కావు..
- సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
Yogi Adityanath: వివాదాస్పద ‘‘బాబ్రీ మసీదు’’ మరోసారి వార్తల్లో అంశంగా మారింది. బెంగాల్లోని ముర్షిదాబాద్లో బాబ్రీ మసీదు నిర్మాణం రేపు ప్రారంభం కానుంది. నిరసనగా హిందూ సంస్థలు లక్నో నుంచి ముర్షిదాబాద్ వరకు మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఇదిలా ఉంటే, తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారియి. బాబ్రీ మసీదు ఎప్పటికీ పునర్నిర్మించబడదని మంగళవారం ఆయన అన్నారు. అదే విధంగా వారి కలలు ఎప్పటికీ నెరవేరవని చెప్పారు.
బారాబంకిలో జరిగిన బహిరంగ సభలో యోగి మాట్లాడుతూ.. అయోధ్యపై బీజేపీ వైఖరిని గర్తు చేస్తూ.. ‘‘మేము రామ్ లల్లా కోసం వస్తామని చెప్పాము, అదే చోట దేవాలయం నిర్మిస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఎవరికైనా ఇంకా అనుమానం ఉందా.? ’’ అని అన్నారు. కయామత్ దినం రాదన్నది నిజం, అలాంటప్పుడు బాబ్రీ నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఆ రోజు కోసం ఎదురుచూసే వారు, అలాంటి కలలు పెట్టుకోవద్దని సూచించారు.
Also Read
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
- Mamata Banerjee: 200కు పైగా సీట్లలో గెలుస్తాం, స్టాక్ మార్కెట్ కోసమే ఎగ్జిట్ పోల్స్..
- China-Pakistan: పాకిస్తాన్కు చైనా J-35AE ఫైటర్ జెట్.. భారత్కు ముప్పు..
భారతదేశ వారసత్వం, అద్భుతమైన సంప్రదాయాలు, సనాతన ధర్మం పట్ల గౌరవాన్ని నొక్కి చెబుతూ, కాషాయ జెండా ఎల్లప్పుడూ దేశ గౌరవాన్ని పెంపొందిస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. అవకాశవాదులకు సంక్షోభ సమయాల్లో మాత్రమే శ్రీరాముడు గుర్తుకు వస్తారని, ఆ తర్వాత మరిచిపోతారని, రాముడు కూడా అలాంటి వారిని మరచిపోతారని సీఎం యోగి అన్నారు. రామభక్తులపై కాల్పులు జరిపి, రాముడి లక్ష్యాన్ని అడ్డుకున్న వారికి చోటు లేదని అన్నారు. ఇదే సమయంలో చట్టాన్ని పాటించే వారు ప్రయోజనం పొందుతారని, అలా చేయని వారు నరకానికి వెళ్తారని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించడం ద్వారా స్వర్గానికి చేరుకోగలమని నమ్మే వారి కలలు ఎప్పటికీ నెరవేరవని ఆయన అన్నారు.
భారత్, సనాతనం పరస్పరం అని రెండింటిని విడదీయలేమని ముఖ్యమంత్రి అన్నారు. సనాతనంపై కుట్రలు పన్నుతున్నవారు వాటికే బలైపోయారని, అలాంటి ఎజెండాలు పనిచేయమని యోగి హెచ్చరించారు. 2017 కి ముందు పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ అల్లర్లు, తరచుగా కర్ఫ్యూలు మరియు అభద్రతా వాతావరణంతో నిండి ఉండేదని, ఆ సమయంలో మహిళలు, వ్యాపారులు, రైతులు, యువత సురక్షితంగా లేరని, దేవాలయాలు, పాఠశాలు, ఇళ్లు కూడా సురక్షితంగా లేవని యోగి అన్నారు. గతంలో ప్రతీ మూడు నాలుగు రోజులకు ఏదో జిల్లాలో కర్ఫ్యూ విధించేవారని, ఇప్పుడు అలాంటి భయాలు లేవని చెప్పారు.
తాజావార్తలు
-
Donald Trump: మేము ‘‘సముద్రపు దొంగలం’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
-
US-Iran War: “ట్రంప్పై నమ్మకం లేదు”.. అమెరికాపై ఇరాన్ అనుమానాలు..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
-
Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!