Chandrababu Meeting: 12 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో బాబు భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో గుంటూరు పార్టీ కార్యాలయంలో భేటీ నిర్వహించనున్నారు. ఇవాళ 12 నియోజకవర్గాల ఇన్ఛార్జులతో చంద్రబాబు సమావేశం జరగనుంది. విశాఖ, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు 12 మందితో పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవనులో సమావేశం జరుగుతుంది. గత రెండు, మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలో జిల్లాలవారీగా సమీక్షలు చేస్తూ.. కొత్త ఇంఛార్జ్లను నియమిస్తున్నారు. తాజాగా విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నేతలతో చంద్రబాబు నేడు సమావేశంకానున్నారు.
ఈ సమావేశానికి గంటా, వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబులు సమావేశానికి రావాలని అధిష్టానం కోరింది. సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వస్తారో రారోననే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును విడిగా కలుస్తానని పార్టీకి గంటా సమాచారం అందించినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా పార్టీకి దూరంగా వుంటున్నారు గంటా. గత ఏడాది వైసీపీలో చేరతారనే సంకేతాలు వినిపించాయి. కానీ ఎందుకో మరి గంటా మౌనంగా వున్నారు. పార్టీల మార్పు గురించి ఎన్ని ఊహాగానాలు వచ్చినా గంటా మాత్రం మౌనంగా వుండి తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాల లేఖను ఏకంగా స్పీకర్కు పంపించారు. మళ్లీ కొద్దిరోజులుగా గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరించడం చర్చనీయాంశం అవుతోంది.
Also Read
- CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ నేతలతో చంద్రబాబు ఇప్పటికే భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గానికి ఎవరిని ఇంచార్జిగా నియమించాలనే దానిపై సుదీర్ఘంగా నేతల అభిప్రాయం తీసుకున్న చంద్రబాబు ఇంకా నిర్ణయం ప్రకటించలేదు. మూడు నాలుగు రోజుల్లో బలమైన నేతను ఇంచార్జి గా నియమిస్తామని నేతలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంచార్జి పదవి ఆశిస్తున్న వారిలో ఇంటూరి నాగేశ్వరరావు, ఇంటూరి రాజేష్, కంచర్ల శ్రీకాంత్ వున్నారు. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు అనారోగ్యంతో బాధపడుతున్నారు. పోటీకి ఆసక్తిగా లేకపోవడంతో కొత్త వారి కోసం చూస్తున్న టీడీపీ అధిష్టానం సరైన నాయకుడి కోసం అన్వేషిస్తోంది. అదే విధంగా పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఇవాళ రెండోరోజు సర్పంచ్ లకు అవగాహన సదస్సు జరుగుతుంది. కొత్త సర్పంచ్ లకు దిశానిర్దేశం చేయనున్నారు చంద్రబాబు. ప్రకాశం, నెల్లూరు, తూ.గో జిల్లాల నుంచి గెలుపొందిన సర్పంచ్ లు ఈ సమావేశానికి హాజరవుతారు.
తాజావార్తలు
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
-
Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
-
Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
-
CM Chandrababu: వెలిగొండ ప్రాజెక్ట్తో దశాబ్దాల కరవు పోతుంది.. అభివృద్ధికి ఓటేయాలన్న చంద్రబాబు
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
ట్రెండింగ్
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!