Guntur Tdp : గుంటూరులో తమ్ముళ్ళకు దిక్కెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా?
ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరం
గుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం ఈస్ట్. ఈ రెండుచోట్లా ప్రజా సమస్యలపై ప్రస్తుతం గట్టిగా పోరాడే నాయకులు లేరు. తూర్పులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పట్టుమని పదిమంది రావడం లేదు. ఎప్పుడేం చేసినా ఒకటే ముఖాలు కనిపిస్తాయి. టీడీపీ ప్రోగ్రామ్స్లో పాల్గొనలేని బిజీ ఆర్టిస్ట్లకు పదవులు కట్టబెట్టి.. పార్టీని నిర్వీర్యం చేశారన్నది తమ్ముళ్ల ఆవేదన. దీంతో ఎప్పటి నుంచో ఉన్న బలమైన క్యాడర్ను దూరమైంది.
Also Read
టీడీపీని నమ్ముకున్నవాళ్లు సైలెంట్
వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిన నేతలు సైతం ప్రస్తుతం టీడీపీలో కనిపించడం లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వ్యక్తిగత అజెండాతో టికెట్లు ఇచ్చారని.. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లు సైలెంట్ అయ్యారు. జరుగుతున్న పరిణామాలు రుచించక మాజీ ఎంపీ లాల్జాన్ పాషా కుటుంబం పార్టీకి దూరం జరిగింది. ఫలితంగా తూర్పు నియోజకవర్గంలోని డివిజన్లలో టీడీపీకి ఓటమి తప్పలేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గెలిచిన నేతలు పార్టీ మారినా.. టీడీపీ చెక్కు చెదరలేదనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉంది.
సమర్థ నాయకత్వాన్ని అందించడంలో పార్టీ వైఫల్యం?
2019 సాధారణ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమతోపాటు గుంటూరు ఎంపీ సీటును టీడీపీ గెల్చుకుంది. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీకి జైకొట్టారు. ప్రస్తుతం పార్టీలో బలమైన నాయకులు లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల్లో పది డివిజన్లను టీడీపీ గెల్చుకోలేకపోయింది. ఇందుకు నాయకత్వ సమస్యే అన్నది కేడర్ చెప్పేమాట. సమర్ధ నాయకత్వాన్ని అందించడంలో పార్టీ వైఫల్యం చెందిందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో కార్పొరేటర్లను.. పక్కపార్టీల నుంచి వచ్చిన నాయకులను ఇంఛార్జ్లుగా పెట్టుకుని టీడీపీ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది.
ఆశావహులు ఉన్నా.. కేడర్ వాళ్లను నమ్మడం లేదా?
గుంటూరు పశ్చిమలో కార్పొరేటర్ నాని టీడీపీ ఇంఛార్జ్. స్వతంత్రంగా పోరాడలేరని.. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేరని నానిపై ముద్ర పడింది. పైగా ఆయన అన్ని పార్టీలతో ఫ్రెండ్షిప్ చేస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే నలుగురైదుగురు ఆశావహులు గుంటూరు వెస్ట్లో రెడీ అయ్యారు. ఎవరికి వారు పార్టీ తమకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం చేసేసుకుంటున్నారట. అయితే ఆ ప్రచారాన్ని తెలుగు తమ్ముళ్లు నమ్మే పరిస్థితి లేదు. అలా అని ఉన్న ఇంఛార్జ్తో పార్టీకి భవిష్యత్ లేదన్నది వారి ఆవేదన.
శ్రేణుల అభిప్రాయాన్ని టీడీపీ అధిష్ఠానం గౌరవిస్తుందా?
ప్రభుత్వంపై పోరాటం చేయలేని వాళ్లు.. టికెట్ ఇస్తే ఇండియాలో లేదా విదేశాలకు వెళ్లిపోయే వాళ్లు టీడీపీని ఎలా కాపాడతారని తమ్ముళ్ల ప్రశ్న. ఇప్పటికే గుంటూరు టీడీపీకి ఎంతో ఇచ్చిందని.. ఇకపై సమర్ధులైన నాయకులను ఇస్తే అండగా ఉంటామని కేడర్ చెబుతోందట. అయితే శ్రేణుల అభిప్రాయాన్ని టీడీపీ అధిష్ఠానం గౌరవిస్తుందా? లేక పాత రాగమే ఆలాపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Commonwealth Games 2026: కామన్వెల్త్ క్రీడల్లో భారత్కు తొలి స్వర్ణం.. చరిత్ర స్పష్టించిన మీరాబాయి చాను..
-
Bandi Sanjay : ‘జెన్-జీకి మంత్రి పదవులు ఇవ్వండి’.. రేవంత్కు బండి సంజయ్ సవాల్
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!