Guntur Tdp : గుంటూరులో తమ్ముళ్ళకు దిక్కెవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరులో టీడీపీకి నాయకుల కొరత ఏర్పడిందా? అధికారంలో ఉన్నప్పుడు తామే మొనగాళ్లం అని చక్రం తిప్పిన నేతలు.. అధికారం పోగానే ముఖం చాటేశారా? నామ్ కే వాస్తేగా ద్వితీయశ్రేణి నాయకులతో టీడీపీ కాలం నెట్టుకొస్తోందా? ఇంఛార్జ్ నియామకంలో పార్టీ వైఫల్యం చెందుతోందా? తమ్ముళ్లకు రిప్లయ్ ఇచ్చేవాళ్లే లేరా?
ఎప్పటి నుంచో ఉన్న బలమైన కేడర్ దూరం
గుంటూరు జిల్లాలో టీడీపీ స్ట్రాంగ్గా ఉండే నియోజకవర్గాల్లో సిటీలోని పశ్చిమ సెగ్మెంట్ ఒకటి. దీంతోపాటు గుంటూరు నగరంలోనే ఉండే మరో నియోజకవర్గం ఈస్ట్. ఈ రెండుచోట్లా ప్రజా సమస్యలపై ప్రస్తుతం గట్టిగా పోరాడే నాయకులు లేరు. తూర్పులో పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు పట్టుమని పదిమంది రావడం లేదు. ఎప్పుడేం చేసినా ఒకటే ముఖాలు కనిపిస్తాయి. టీడీపీ ప్రోగ్రామ్స్లో పాల్గొనలేని బిజీ ఆర్టిస్ట్లకు పదవులు కట్టబెట్టి.. పార్టీని నిర్వీర్యం చేశారన్నది తమ్ముళ్ల ఆవేదన. దీంతో ఎప్పటి నుంచో ఉన్న బలమైన క్యాడర్ను దూరమైంది.
Also Read
టీడీపీని నమ్ముకున్నవాళ్లు సైలెంట్
వార్డు కార్పొరేటర్గా పోటీ చేసి ఓడిన నేతలు సైతం ప్రస్తుతం టీడీపీలో కనిపించడం లేదు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వ్యక్తిగత అజెండాతో టికెట్లు ఇచ్చారని.. పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లు సైలెంట్ అయ్యారు. జరుగుతున్న పరిణామాలు రుచించక మాజీ ఎంపీ లాల్జాన్ పాషా కుటుంబం పార్టీకి దూరం జరిగింది. ఫలితంగా తూర్పు నియోజకవర్గంలోని డివిజన్లలో టీడీపీకి ఓటమి తప్పలేదు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గెలిచిన నేతలు పార్టీ మారినా.. టీడీపీ చెక్కు చెదరలేదనే అభిప్రాయం తమ్ముళ్లలో ఉంది.
సమర్థ నాయకత్వాన్ని అందించడంలో పార్టీ వైఫల్యం?
2019 సాధారణ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమతోపాటు గుంటూరు ఎంపీ సీటును టీడీపీ గెల్చుకుంది. ఆ తర్వాత గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే వైసీపీకి జైకొట్టారు. ప్రస్తుతం పార్టీలో బలమైన నాయకులు లేకపోవడంతో కార్పొరేషన్ పరిధిలోని నియోజకవర్గాల్లో పది డివిజన్లను టీడీపీ గెల్చుకోలేకపోయింది. ఇందుకు నాయకత్వ సమస్యే అన్నది కేడర్ చెప్పేమాట. సమర్ధ నాయకత్వాన్ని అందించడంలో పార్టీ వైఫల్యం చెందిందా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో కార్పొరేటర్లను.. పక్కపార్టీల నుంచి వచ్చిన నాయకులను ఇంఛార్జ్లుగా పెట్టుకుని టీడీపీ కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ఉంది.
ఆశావహులు ఉన్నా.. కేడర్ వాళ్లను నమ్మడం లేదా?
గుంటూరు పశ్చిమలో కార్పొరేటర్ నాని టీడీపీ ఇంఛార్జ్. స్వతంత్రంగా పోరాడలేరని.. ప్రభుత్వంపై గట్టిగా మాట్లాడలేరని నానిపై ముద్ర పడింది. పైగా ఆయన అన్ని పార్టీలతో ఫ్రెండ్షిప్ చేస్తారని ప్రచారం ఉంది. ఇప్పటికే నలుగురైదుగురు ఆశావహులు గుంటూరు వెస్ట్లో రెడీ అయ్యారు. ఎవరికి వారు పార్టీ తమకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం చేసేసుకుంటున్నారట. అయితే ఆ ప్రచారాన్ని తెలుగు తమ్ముళ్లు నమ్మే పరిస్థితి లేదు. అలా అని ఉన్న ఇంఛార్జ్తో పార్టీకి భవిష్యత్ లేదన్నది వారి ఆవేదన.
శ్రేణుల అభిప్రాయాన్ని టీడీపీ అధిష్ఠానం గౌరవిస్తుందా?
ప్రభుత్వంపై పోరాటం చేయలేని వాళ్లు.. టికెట్ ఇస్తే ఇండియాలో లేదా విదేశాలకు వెళ్లిపోయే వాళ్లు టీడీపీని ఎలా కాపాడతారని తమ్ముళ్ల ప్రశ్న. ఇప్పటికే గుంటూరు టీడీపీకి ఎంతో ఇచ్చిందని.. ఇకపై సమర్ధులైన నాయకులను ఇస్తే అండగా ఉంటామని కేడర్ చెబుతోందట. అయితే శ్రేణుల అభిప్రాయాన్ని టీడీపీ అధిష్ఠానం గౌరవిస్తుందా? లేక పాత రాగమే ఆలాపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!