Lokesh Vizag Tour: కోర్టులో హాజరుకానున్న లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనన్నారు నారా లోకేష్. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా రేపు హాజరుకానున్నారు లోకేష్.
మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తమకు అందుబాటులో ఉండటం లేదు అని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు నేతలు. బొజ్జల సుధీర్ తో కొద్దిసేపు విడిగా మాట్లాడారు చంద్రబాబు.స్థానికంగా ఉన్న ఫీడ్ బ్యాక్ ను సుధీర్ కు వివరించారు చంద్రబాబు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు.
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- OTR: ఆదోని, ఎమ్మిగనూరు కూటమిలో కుమ్ములాటలు స్థానిక ఎన్నికలపై ప్రభావం ..?
- AP Municipal Elections: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు
తండ్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కష్టపడాలని సుధీర్ కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇకపై నియోజకవర్గ నేతలతో నిత్యం అందుబాటులో ఉంటానని చంద్రబాబు సమక్షంలో నేతలకు స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!