Lokesh Vizag Tour: కోర్టులో హాజరుకానున్న లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేత నారా లోకేష్ రేపు విశాఖ వెళ్లనున్నారు. విశాఖ కోర్టులో ఓ పరువు నష్టం కేసుకి హాజరుకానున్నారు లోకేష్. తనపై అసత్య ఆరోపణలు ప్రచురించారని ఓ దినపత్రిక పై లోకేష్ రూ. 75కోట్లకు విశాఖ 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో పరువునష్టం దావా వేశారు లోకేష్. 2019 అక్టోబర్ 22న విశాఖ విమానాశ్రయంలో లోకేష్ ప్రజాధనంతో రూ. 25 లక్షలకు చిరుతిళ్లు తిన్నారని పత్రికలో కథనం ప్రచురించింది. పత్రిక ప్రచురించిన తేదీల్లో తాను విశాఖలో లేనన్నారు నారా లోకేష్. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిధుల మర్యాదల కోసం వెచ్చించే ప్రోటోకాల్ ఖర్చును తనపై అసత్యాలతో ప్రచురించారంటూ రూ. 75 కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి విశాఖ కోర్టుకు స్వయంగా రేపు హాజరుకానున్నారు లోకేష్.
మరోవైపు శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇన్ ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి తమకు అందుబాటులో ఉండటం లేదు అని చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు నేతలు. బొజ్జల సుధీర్ తో కొద్దిసేపు విడిగా మాట్లాడారు చంద్రబాబు.స్థానికంగా ఉన్న ఫీడ్ బ్యాక్ ను సుధీర్ కు వివరించారు చంద్రబాబు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని బొజ్జల సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సుధీర్ రెడ్డికి సూచించారు చంద్రబాబు.
Also Read
- AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
- AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
తండ్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఏ విధంగా కష్టపడ్డారో అదే విధంగా కష్టపడాలని సుధీర్ కు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. ఇకపై నియోజకవర్గ నేతలతో నిత్యం అందుబాటులో ఉంటానని చంద్రబాబు సమక్షంలో నేతలకు స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో మళ్లీ పసుపు జెండా ఎగరవేయాలని నేతలకు చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
UIDAI Aadhaar Face Authentication: ఆధార్ వెరిఫికేషన్లో భారీ మార్పులు.. UIDAI తీసుకొచ్చిన కొత్త టూల్ ఇదే
-
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక పరిణామాలు.. అప్రూవర్ పిటిషన్కు ఓకే.. కారుమూరికి పీటీ వారెంట్..
-
సూపర్ఫాస్ట్ ఛార్జింగ్, హెల్త్ ట్రాకింగ్లో బిగ్ అప్గ్రేడ్, ఏఐ ఫీచర్లతో Apple Watch Series 12 విడుదల..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!