Team India: 35 నెలల్లో ముగ్గురు స్టార్ క్రికెటర్లు కలిసి ఆడింది ఒక్క వన్డేనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ తినాల్సిందే. ఎందుకంటే 35 నెలల కాలంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి ఆడింది కేవలం ఒక్క వన్డే మాత్రమే. గత ఏడాది ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో ఈ త్రయం కలిసి ఆడింది. ఆ తర్వాత వీళ్లు కలిసి ఆడిన దాఖలాలు లేవు.
Read Also: Harish Rao: మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపేశారు
Also Read
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
- Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
చివరి మూడేళ్లలో టీమిండియా రెండు టీ20 ప్రపంచకప్లను ఆడింది. ముఖ్యంగా రెండేళ్లుగా టీమిండియా టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఆడింది. దీంతో వన్డే ఫార్మాట్కు, టీ20 ఫార్మాట్కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ఫార్మాట్కు శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించి పలు దేశాల టూర్లకు పంపించింది. దీంతో సీనియర్ క్రికెటర్లకు వన్డే సిరీస్ల నుంచి విశ్రాంతి కల్పించింది. గాయాలు, ఫిట్నెస్ ఇబ్బందులతో రోహిత్ వన్డే ఫార్మాట్కు దూరంగా ఉండగా.. కోహ్లీ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో వన్డేలకు దూరంగా ఉన్నాడు. అటు పనిభారం కారణంగా బుమ్రా కూడా వన్డేలకు అందుబాటులో లేడు. మరోవైపు వెన్నెముక గాయం కారణంగా గత ఏడాది బుమ్రా కేవలం ఐదు వన్డేలు, ఐదు టీ20లు మాత్రమే ఆడాడు. కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయానికి బుమ్రా గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ప్రాక్టీస్ సాధించడం జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ దిశగా బీసీసీఐ అతడిని సానబెట్టాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!