Team India: 35 నెలల్లో ముగ్గురు స్టార్ క్రికెటర్లు కలిసి ఆడింది ఒక్క వన్డేనేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో తెలిస్తే మీరు షాక్ తినాల్సిందే. ఎందుకంటే 35 నెలల కాలంలో రోహిత్, కోహ్లీ, బుమ్రా కలిసి ఆడింది కేవలం ఒక్క వన్డే మాత్రమే. గత ఏడాది ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో ఈ త్రయం కలిసి ఆడింది. ఆ తర్వాత వీళ్లు కలిసి ఆడిన దాఖలాలు లేవు.
Read Also: Harish Rao: మీటర్లు పెట్టలేదని రూ.30 వేల కోట్లు ఆపేశారు
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
- World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
చివరి మూడేళ్లలో టీమిండియా రెండు టీ20 ప్రపంచకప్లను ఆడింది. ముఖ్యంగా రెండేళ్లుగా టీమిండియా టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని ఆడింది. దీంతో వన్డే ఫార్మాట్కు, టీ20 ఫార్మాట్కు వేర్వేరు ఆటగాళ్లను ఎంపిక చేసింది. వన్డే ఫార్మాట్కు శిఖర్ ధావన్ను కెప్టెన్గా నియమించి పలు దేశాల టూర్లకు పంపించింది. దీంతో సీనియర్ క్రికెటర్లకు వన్డే సిరీస్ల నుంచి విశ్రాంతి కల్పించింది. గాయాలు, ఫిట్నెస్ ఇబ్బందులతో రోహిత్ వన్డే ఫార్మాట్కు దూరంగా ఉండగా.. కోహ్లీ కూడా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటంతో వన్డేలకు దూరంగా ఉన్నాడు. అటు పనిభారం కారణంగా బుమ్రా కూడా వన్డేలకు అందుబాటులో లేడు. మరోవైపు వెన్నెముక గాయం కారణంగా గత ఏడాది బుమ్రా కేవలం ఐదు వన్డేలు, ఐదు టీ20లు మాత్రమే ఆడాడు. కాగా ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ సమయానికి బుమ్రా గాయం నుంచి కోలుకుని మ్యాచ్ ప్రాక్టీస్ సాధించడం జట్టుకు ఎంతో ముఖ్యం. ఈ దిశగా బీసీసీఐ అతడిని సానబెట్టాల్సిన అవసరం ఉంది.
తాజావార్తలు
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!