IND vs BAN: ఇండియాలో తొమ్మిదేళ్ల తర్వాత అనూహ్య పరిణామం..
- భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్
- కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో మ్యాచ్
- రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు
- తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉదయం తేలికపాటి చినుకులు పడి.. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో.. రెండవ రోజు గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆట జరగలేదు. మొదటి రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 35 ఓవర్ల ఆట తరువాత.. వర్షం కారణంగా ఆట రద్దు చేశారు. అంతకుముందు.. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రోజంతా ఆడలేని పరిస్థితి ఏర్పడింది.
2015లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. భారత్ 22 ఓవర్లలో 80 పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ డ్రాగా ప్రకటించాల్సి వచ్చింది.
Also Read
- Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్ప్రీత్ సంతోషం!
- Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
- Lala Amarnath: భారత్కు తొలి సెంచరీ అందించిన వీరుడు.. పాకిస్థాన్ను చిత్తు చేసిన ఈ హీరో గురించి మీకు తెలుసా?
- బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. Women's Asia Cup 2026 ఫైనల్కు టీమిండియా.!
Read Also: Health: వేగంగా విస్తరిస్తున్న సమస్య.. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఈ వ్యాధి
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండవ రోజు 11:15 గంటలకు వర్షం ఆగిపోయినప్పుడు గ్రౌండ్స్మెన్ మూడు సూపర్ సాపర్లను ప్రయోగించారు. వెలుతురు కూడా స్పష్టంగా లేదు.. దీంతో అధికారికంగా 2:15కి గేమ్ను రద్దు చేయాల్సి వచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తొలి రోజు వర్షం కారణంగా బంగ్లాదేశ్ 35 ఓవర్లు మాత్రమే ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాంలను అవుట్ చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో వికెట్ తీశాడు. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Read Also: PM Modi: సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం
తాజావార్తలు
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
-
Gold-Silver Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24K, 22K, 18K రేట్లు ఎంతంటే?
-
Assam Magic Rice: “మ్యాజిక్ బియ్యం”.. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!