IND vs BAN: ఇండియాలో తొమ్మిదేళ్ల తర్వాత అనూహ్య పరిణామం..
- భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్
- కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో మ్యాచ్
- రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దు
- తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉదయం తేలికపాటి చినుకులు పడి.. ఆ తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో.. రెండవ రోజు గ్రీన్ పార్క్ స్టేడియంలో ఆట జరగలేదు. మొదటి రోజు కూడా వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 35 ఓవర్ల ఆట తరువాత.. వర్షం కారణంగా ఆట రద్దు చేశారు. అంతకుముందు.. 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో రోజంతా ఆడలేని పరిస్థితి ఏర్పడింది.
2015లో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో రెండో మ్యాచ్లో వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్.. ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 59 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. భారత్ 22 ఓవర్లలో 80 పరుగులు చేసినప్పటికీ ఆ తర్వాత మ్యాచ్ డ్రాగా ప్రకటించాల్సి వచ్చింది.
Also Read
- Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
- MI vs CSK: వాంఖడేలో భావోద్వేగ క్షణం.. తల్లిని కోల్పోయినా మైదానంలోకి దిగిన సీఎస్కే ప్లేయర్ ముఖేష్ చౌదరి
- IPL 2026: ‘మీరు మారిపోయారు సార్’.. లక్నో ఓడినా పంత్ను హత్తుకున్న ఓనర్ సంజీవ్ గోయెంకా..
- IPL 2026: ‘వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకో’.. ఆ ఆటగాడిపై తీవ్ర ఆగ్రహం..
Read Also: Health: వేగంగా విస్తరిస్తున్న సమస్య.. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఈ వ్యాధి
ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ విషయానికొస్తే.. రెండవ రోజు 11:15 గంటలకు వర్షం ఆగిపోయినప్పుడు గ్రౌండ్స్మెన్ మూడు సూపర్ సాపర్లను ప్రయోగించారు. వెలుతురు కూడా స్పష్టంగా లేదు.. దీంతో అధికారికంగా 2:15కి గేమ్ను రద్దు చేయాల్సి వచ్చింది. వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం కూడా వర్షం పడే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటుందని పేర్కొంది. ఈ క్రమంలో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తొలి రోజు వర్షం కారణంగా బంగ్లాదేశ్ 35 ఓవర్లు మాత్రమే ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ బంగ్లాదేశ్ ఓపెనర్లు జకీర్ హసన్, షాద్మాన్ ఇస్లాంలను అవుట్ చేయగా.. రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో వికెట్ తీశాడు. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉంది.
Read Also: PM Modi: సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!