PM Modi: సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం
- సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం
- రుజువు అడిగిన కాంగ్రెస్ను ప్రజలు క్షమించరు
- జమ్మూకాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదం మార్గదర్శకులకు సర్జికల్ స్ట్రైక్స్తో బుద్ధి చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్లో మూడో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్టైక్స్తో శత్రుదేశాలకు భయం పుట్టించామని.. మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దెబ్బలు తగులుతాయని అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సర్జికల్ స్ట్రైక్తో శత్రు భూభాగంలో దాడి చేయగల కొత్త భారత్ను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని ప్రధాని శనివారం అన్నారు.
ఇది కూడా చదవండి: IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..
Also Read
- Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
- Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
- Sugar Prices: చక్కెర ధరలపై గుడ్న్యూస్.. దిగిరానున్న ధరలు
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
2016, సెప్టెంబర్ 18న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్ స్టైక్స్ జరిగినట్లు గుర్తుచేవారు. ఈ చర్యతో శత్రు దేశం భయపడిందన్నారు. ఏదైనా తీవ్రమైన పని చేస్తే.. భారత్ దెబ్బ తట్టుకోలేమని శత్రు దేశం భావించిందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లుగా రుజువు కావాలని కోరినందుకు కాంగ్రెస్ను ప్రజలు ఎప్పటికీ క్షమించలేరని ప్రధాని అన్నారు.
జమ్మూకాశ్మీర్ ప్రజలు ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ కుటుంబాలతో విసిగిపోయారన్నారు. ఇక్కడ ప్రజలు అవినీతి పార్టీలను కోరుకోవని చెప్పారు. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారన తెలిపారు. పిల్లల మంచి భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. రెండు దశల్లో జరిగిన పోలింగ్లో బీజేపీకే ఓటు వేశారన్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 12 విజయదశమి ఘనంగా జరుపుకోవాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ ప్రాంతంలోని ప్రజలపై ఉన్న చారిత్రక వివక్షను తొలగించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ పాలనలో జమ్మూకాశ్మీర్ ఎంతగానో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Health: వేగంగా విస్తరిస్తున్న సమస్య.. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఈ వ్యాధి
అక్టోబర్ 1న ఓటింగ్ జరగనున్న జమ్మూ, సాంబా, కథువా, ఉధంపూర్ జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 24 మంది బీజేపీ అభ్యర్థులు వేదికపై ఉన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. జమ్మూ జిల్లాలో 11, కథువాలో 6, సాంబా 3, ఉధంపూర్లో 4 సీట్లు ఉన్నాయి. ఈ నియోజక వర్గాలకు మూడో దశలో ఓటింగ్ జరగనుంది. చివరి దశ అక్టోబర్ 1న జరగనుంది. కౌంటింగ్ అక్టోబర్ 8న జరగనుంది. జమ్మూకాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు
తాజావార్తలు
-
Karumuri Nageswara Rao : కారుమూరికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. చంచల్గూడ జైలుకు తరలింపు
-
Jinping: భారీ బృందంతో ఢిల్లీకి వస్తున్న చైనా అధ్యక్షుడు.. బ్రిక్స్లో పాల్గొననున్న జిన్పింగ్
-
Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!