Vijaysai Reddy: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు!
- మళ్లీ అధికారంలోకి వస్తాం
- చంద్రబాబే ఓ క్రిమినల్
- చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదని వైసీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు అందర్నీ క్రిమినల్ అంటారని, ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడన్నారు. బాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు.. అందులకే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారని, రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చంద్రబాబుకు మతి భ్రమించింది. ఆయన ఓ క్రిమినల్. అందర్నీ క్రిమినల్ అంటారు కానీ.. ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడు. చంద్రబాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు. తను జైలుకు వెళ్లానని నాతో సహా అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారు. అందుకే రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారు. కేవీరావు ఓ బ్రోకర్. ఆయనకు అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నాడు?. కేవీరావు చంద్రబాబు చెంచా. కేవీరావు ఫిర్యాదు మీద విచారణే లేకుండా నేరుగా కేస్ ఫైల్ చేయడం ఓ డ్రామా’ అని అన్నారు.
Also Read
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
‘మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. సీఎం చంద్రబాబు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదు. కెవీరావు ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఆయన్ను విక్రాంత్ రెడ్డి భయపెట్టడమా?. చంద్రబాబు చేతిలో రాష్ట్రం నాశనం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. చంద్రబాబుకు పాలనే చేతకాదు. మీరు మీ నాయకుడిని మార్చుకోండి. లోకేష్ అసమర్ధుడు.. ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తండ్రీ, కొడుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి తొలగించి రాష్ట్రాన్ని కాపాడండి. కేవీరావు పెద్ద బ్రోకర్ అని, రాష్ట్రాన్ని ఏలా దోచేశాడో 2012లోనే పవన్ కల్యాణ్ చెప్పారు. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు. వచ్చే వారంలో చంద్రబాబు, కేవీరావుపైన హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నా. నేను ఎక్కడికైనా వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి కావాలి. అది తెలిసీ నాకు లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడం ఏంటి?. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే లుక్ అవుట్ నోటీస్ పంపారు. చంద్రబాబు మీద కేస్ పెడతాం’ అని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!