Vijaysai Reddy: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు!
- మళ్లీ అధికారంలోకి వస్తాం
- చంద్రబాబే ఓ క్రిమినల్
- చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాము మళ్లీ అధికారంలోకి వస్తామని, సీఎం చంద్రబాబు నాయుడు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదని వైసీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు అందర్నీ క్రిమినల్ అంటారని, ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడన్నారు. బాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు.. అందులకే అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడని మండిపడ్డారు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారని, రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ కంటే పవన్ కళ్యాణ్ బెటర్ లీడర్ అవుతారు అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఢిల్లీలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… ‘సీఎం చంద్రబాబుకు మతి భ్రమించింది. ఆయన ఓ క్రిమినల్. అందర్నీ క్రిమినల్ అంటారు కానీ.. ఆయనే ఓ క్రిమినల్ అని తెలుసుకోడు. చంద్రబాబు 55 రోజులు జైల్లో ఉన్నాడు. తను జైలుకు వెళ్లానని నాతో సహా అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడు. హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయలేకపోతున్నారు. అందుకే రోజుకో సమస్య తెచ్చి దాని మీదే కాలం గడుపుతున్నారు. కేవీరావు ఓ బ్రోకర్. ఆయనకు అన్యాయం జరిగితే నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నాడు?. కేవీరావు చంద్రబాబు చెంచా. కేవీరావు ఫిర్యాదు మీద విచారణే లేకుండా నేరుగా కేస్ ఫైల్ చేయడం ఓ డ్రామా’ అని అన్నారు.
Also Read
- Balka Suman: బాల్క సుమన్కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
‘మేం మళ్లీ అధికారంలోకి వస్తాం. సీఎం చంద్రబాబు బతికి ఉంటే తిరిగి జైలుపాలు కాక తప్పదు. కెవీరావు ప్రపంచవ్యాప్తంగా బ్రోకర్ పనులు చేస్తుంటాడు. ఆయన్ను విక్రాంత్ రెడ్డి భయపెట్టడమా?. చంద్రబాబు చేతిలో రాష్ట్రం నాశనం అవుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. చంద్రబాబుకు పాలనే చేతకాదు. మీరు మీ నాయకుడిని మార్చుకోండి. లోకేష్ అసమర్ధుడు.. ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తండ్రీ, కొడుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చంద్రబాబును సీఎం పదవి నుంచి తొలగించి రాష్ట్రాన్ని కాపాడండి. కేవీరావు పెద్ద బ్రోకర్ అని, రాష్ట్రాన్ని ఏలా దోచేశాడో 2012లోనే పవన్ కల్యాణ్ చెప్పారు. కాకినాడ పోర్టును తన బినామీ కేవీరావుకు అప్పగించాలని చంద్రబాబు చూస్తున్నారు. వచ్చే వారంలో చంద్రబాబు, కేవీరావుపైన హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నా. నేను ఎక్కడికైనా వెళ్లాలంటే సీబీఐ కోర్టు అనుమతి కావాలి. అది తెలిసీ నాకు లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడం ఏంటి?. నా ప్రతిష్టను దెబ్బతీయడానికే లుక్ అవుట్ నోటీస్ పంపారు. చంద్రబాబు మీద కేస్ పెడతాం’ అని విజయసాయి రెడ్డి చెప్పారు.
తాజావార్తలు
-
RCB vs GT Final: ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. ఐపీఎల్ 2026 విజేత ఎవరు?.. పూర్తి వివరాలు ఇవే!
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్దే ఐపీఎల్ 2026 టైటిల్?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..