Ukrainian: భారత్ సాయం కోరిన ఉక్రెయిన్.. స్పందించని మోడీ సర్కార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine war: రష్యా నుంచి భీకర దాడులను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. సాయం కోసం భారత్కు విజ్ఞప్తి చేసింది. రష్యా దాడుల కారణంగా దేశం సర్వనాశనమైందని తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైందని ఉక్రెయిన్ పేర్కొంది. ప్రపంచ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు వీలుగా పునర్నిర్మాణంలో ఉక్రెయిన్ ఇప్పుడు భారతదేశం నుంచి సహాయం కోరింది. గుజరాత్లో జరిగిన వైబ్రంట్ సదస్సులో ఉక్రెయిన్ డిప్యూటీ ఆర్థిక మంత్రి వోలోడిమిర్ కుజ్యో దేశాన్ని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడానికి ఒక ప్రణాళికను సమర్పించారు. దీని వల్ల ఉక్రెయిన్కే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా మేలు జరుగుతుందన్నారు. గుజరాత్లో ఉక్రెయిన్ అధికారులకు వేదిక ఇవ్వడం భారత విదేశాంగ విధానంలో మార్పుకు సంకేతంగా భావిస్తున్నారు.
Read Also: Pawan Kalyan: గుంటూరు కారం రిలీజ్ రోజున ట్రెండ్ అవుతున్న అజ్ఞాతవాసి…
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
అయితే, రష్యా- ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పటికీ, మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు ఉక్రెయిన్ ఈ కామెంట్స్ చేసింది. అయితే, భారత్- రష్యా మధ్య దశాబ్దాలుగా సాంప్రదాయ సంబంధాలు కొనసాగుతున్నాయి. చమురుతో పాటు, ఆయుధాలు, అణు సాంకేతికతను రష్యా నుంచి భారత్ తీసుకుంటుంది. ఇక, ప్రస్తుతం హైవేలు నిర్మించడం, సముద్రంతో పాటు నది నౌకాశ్రయాలు, రైలు రోడ్లు, నిల్వ, పంపిణీ వంటి మౌలిక సదుపాయాలలో భారతదేశం పెట్టుబడి పెట్టాలని ఉక్రెయిన్ ప్రభుత్వం కోరుతుంది.
Read Also: Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!
ఇక, ఉక్రెయిన్లోని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అక్కడక్కడ పడి ఉన్న ల్యాండ్మైన్లను తొలగించడంలో భారతదేశం సహాయం చేయాలని జెలెన్స్కీ ప్రభుత్వం కోరుతోంది. అయితే, ఉక్రెయిన్ డిమాండ్పై భారత్ ఇంకా స్పందించలేదు.. కాగా, ఉక్రెయిన్ కోరినప్పటికీ భారత్ అక్కడ ఎలాంటి పెట్టుబడులు పెట్టబోదని పలువురు నిపుణులు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!