Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా మనోహరబాద్ మండలం జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. బట్టకాల్చి మీద వేసి రకరకాల కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఎన్ని రోజులు కుట్రలు చేసిన నిజాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటుంది.. మరి కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గజ్వేల్ డెవలప్మెంట్ అథారిటీని రద్దు చేశారని, మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్కు ప్రజలంటే బాధ్యత అని హరీష్ రావు అన్నారు.
Read also: Karimnagar: ఆ కోడి నాదే ఇచ్చేయండి.. అంత సీన్ లేదన్న ఆర్టీసీ అధికారులు
Also Read
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
- Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
- Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. రైల్వే బ్రిడ్జిని ఢీ కొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.!
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిసెంబర్ లో మొదటిసారిగా సమావేశాలు జరిగాయని, ఆ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీపై, ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే విమర్శలు చేసిందని.. అయినప్పటికీ సీఎం, మంత్రులు ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారని నిన్న మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎంపీ ఎన్నికల్లో అందరం కష్టపడాలి.. మీరు చెప్పిన అంశాలు ప్రతిదీ చర్చిస్తామన్నారు. నెల అయితే కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లో ఉంటారు.. అందరం ఇక్కడే ఉంటామని తెలిపారు. ఏ ఒక్కరికీ సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకొని మీ ముందుకు వస్తామని చెప్పారు. మరోవైపు.. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి.. వారిది వారికే పడటం లేదని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. అంతేకాకుండా.. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం.. అవసరమైన వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు.
Donald Trump: నేను ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేస్తున్నారు..
తాజావార్తలు
-
Infosys: ఉద్యోగాల ఊస్ట్ సమయంలోనూ ఈ కంపెనీ ఏకంగా కోటి రూపాయల జీతాలు ఎలా ఇస్తోంది?
-
Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!