Rohit Sharma: మీడియా కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు. ఇరుజట్లు ఆడగల సామర్థ్యం కలిగిన జట్లుగా రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఫైనల్ మ్యాచ్.. తన కెరీర్ లోనే ఎంతో గొప్పదని హిట్మ్యాన్ చెప్పాడు. తాను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్.. బెట్టింగ్రాయుళ్లపై ప్రత్యేక నిఘా
Also Read
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ 'నో-లుక్' షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
ప్లేయింగ్ ఎలెవన్ పై ఏమన్నాడంటే..?
ఫైనల్ మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ.. మొత్తం 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉందని భారత కెప్టెన్ చెప్పాడు. ఈరోజు పిచ్ పరిస్థితులను పరిశీలించామని.. రేపు పిచ్ పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు 12-13 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ కాలేదని తెలిపాడు.
పిచ్ స్వభావం
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో గ్రీనరీ లేదని, అయితే ఈసారి తేలికపాటి గ్రీనరీ ఉందని చెప్పాడు. నేను ఈ రోజు పిచ్ చూడలేదు, కానీ అది నెమ్మదిగా ఉంటుందని తెలిపాడు. రేపు పిచ్ చూసి పరిస్థితులను తెలుసుకుంటామన్నాడు.
టాస్ కీలకం కానుందా?
ఫైనల్ మ్యాచ్లో టాస్ ముఖ్యం కాదని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితులు అర్థం చేసుకుని మంచి క్రికెట్ ఆడతామని తెలిపాడు.
షమీ గురించి..
ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. టోర్నీ తొలి భాగంలో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం అని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ… సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని కొనియాడాడు. నెట్స్ లో షమీ తన బౌలింగ్ కు మరింతగా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు.
తాజావార్తలు
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ – కావ్య వివాహం
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?