Rohit Sharma: మీడియా కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు. ఇరుజట్లు ఆడగల సామర్థ్యం కలిగిన జట్లుగా రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఫైనల్ మ్యాచ్.. తన కెరీర్ లోనే ఎంతో గొప్పదని హిట్మ్యాన్ చెప్పాడు. తాను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్.. బెట్టింగ్రాయుళ్లపై ప్రత్యేక నిఘా
Also Read
- Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
- Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
- Ollie Robinson: 100 ఏళ్ల చరిత్రలో ఏకైక బౌలర్గా ఘనత.. రాబిన్సన్ హిస్టారిక్ రికార్డ్..
ప్లేయింగ్ ఎలెవన్ పై ఏమన్నాడంటే..?
ఫైనల్ మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ.. మొత్తం 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉందని భారత కెప్టెన్ చెప్పాడు. ఈరోజు పిచ్ పరిస్థితులను పరిశీలించామని.. రేపు పిచ్ పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు 12-13 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ కాలేదని తెలిపాడు.
పిచ్ స్వభావం
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో గ్రీనరీ లేదని, అయితే ఈసారి తేలికపాటి గ్రీనరీ ఉందని చెప్పాడు. నేను ఈ రోజు పిచ్ చూడలేదు, కానీ అది నెమ్మదిగా ఉంటుందని తెలిపాడు. రేపు పిచ్ చూసి పరిస్థితులను తెలుసుకుంటామన్నాడు.
టాస్ కీలకం కానుందా?
ఫైనల్ మ్యాచ్లో టాస్ ముఖ్యం కాదని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితులు అర్థం చేసుకుని మంచి క్రికెట్ ఆడతామని తెలిపాడు.
షమీ గురించి..
ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. టోర్నీ తొలి భాగంలో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం అని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ… సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని కొనియాడాడు. నెట్స్ లో షమీ తన బౌలింగ్ కు మరింతగా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు.
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!