Rohit Sharma: మీడియా కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు.. ఏం చెప్పాడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్కు ముందు.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా కాన్ఫరెన్స్ లో కీలక విషయాలు వెల్లడించాడు. ఆస్ట్రేలియా చివరి ఎనిమిది మ్యాచ్లలో విజయం సాధించినందుకు తనకు ఎటువంటి ఇబ్బంది లేదని రోహిత్ శర్మ చెప్పాడు. అంతేకాకుండా.. ఈ ప్రపంచకప్ కోసం రెండేళ్ల కిందటే సన్నాహాలు ప్రారంభించినట్లు తెలిపాడు. ఇరుజట్లు ఆడగల సామర్థ్యం కలిగిన జట్లుగా రోహిత్ శర్మ తెలిపాడు. ఈ ఫైనల్ మ్యాచ్.. తన కెరీర్ లోనే ఎంతో గొప్పదని హిట్మ్యాన్ చెప్పాడు. తాను 50 ఓవర్ల ప్రపంచకప్ చూస్తూ పెరిగానని చెప్పుకొచ్చాడు. జట్టులో ఏ ఆటగాడు ఏ పాత్ర పోషించాలన్న దానిపై స్పష్టత ఉందని, అప్పగించిన బాధ్యతలు నెరవేర్చగల సరైన ఆటగాళ్లను గుర్తించి వారిని జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
World Cup 2023 Final: వరల్డ్ కప్ ఫైనల్.. బెట్టింగ్రాయుళ్లపై ప్రత్యేక నిఘా
Also Read
- ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
- Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Sikandar Raza: నేనే జట్టును నిరాశపరిచాను.. ఓటమికి బాధ్యత నాదే.. నిజాయితీగా ఒప్పుకున్న జింబాబ్వే కెప్టెన్..
ప్లేయింగ్ ఎలెవన్ పై ఏమన్నాడంటే..?
ఫైనల్ మ్యాచ్లో ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడుతూ.. మొత్తం 15 మంది ఆటగాళ్లు ఆడే అవకాశం ఉందని భారత కెప్టెన్ చెప్పాడు. ఈరోజు పిచ్ పరిస్థితులను పరిశీలించామని.. రేపు పిచ్ పరిస్థితులను పరిశీలిస్తామని చెప్పారు. మరోవైపు 12-13 మంది ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని, కానీ ప్లేయింగ్ ఎలెవెన్ సెట్ కాలేదని తెలిపాడు.
పిచ్ స్వభావం
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్లో గ్రీనరీ లేదని, అయితే ఈసారి తేలికపాటి గ్రీనరీ ఉందని చెప్పాడు. నేను ఈ రోజు పిచ్ చూడలేదు, కానీ అది నెమ్మదిగా ఉంటుందని తెలిపాడు. రేపు పిచ్ చూసి పరిస్థితులను తెలుసుకుంటామన్నాడు.
టాస్ కీలకం కానుందా?
ఫైనల్ మ్యాచ్లో టాస్ ముఖ్యం కాదని రోహిత్ శర్మ చెప్పాడు. పరిస్థితులు అర్థం చేసుకుని మంచి క్రికెట్ ఆడతామని తెలిపాడు.
షమీ గురించి..
ఈ వరల్డ్ కప్ లో 23 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన మహ్మద్ షమీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు. టోర్నీ తొలి భాగంలో షమీని జట్టులోకి తీసుకోకపోవడం కఠినమైన అంశం అని అభిప్రాయపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ… సిరాజ్, ఇతర పేసర్లకు ఎంతో మద్దతుగా నిలిచాడని కొనియాడాడు. నెట్స్ లో షమీ తన బౌలింగ్ కు మరింతగా సానబెట్టుకున్నాడని కితాబునిచ్చాడు.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్కు చెక్.. సిరీస్తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!