Republic Day Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
- జాతీయ పతాకాన్ని ఎగురవేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
- పాల్గొన్న ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు.
హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, రామ చందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకుని అవమానిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం స్ఫూర్తి అర్థం కాదు.. రాజ్యాంగాన్ని కాలరాసి ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ అని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు నుండి ప్రతి ఇంటికి, ప్రతి బస్తీకి వెళ్లి.. అంబేద్కర్, రాజ్యాంగం గొప్పదనాన్ని వివరించాలని తెలిపారు. మన దేశం మదర్ ఆఫ్ డెమోక్రసీ.. బీజేపీ మనసా వాచా అంబేద్కర్ ఆలోచనలకి, రాజ్యాంగానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. నరేంద్ర మోడీ సర్కారు ఏ ప్రభుత్వంన్నా కూల్చలేదని అన్నారు. జిన్నా రాజ్యాంగాన్ని రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన ఘనత మోడీదని తెలిపారు. ఓట్ల కోసం మోడీ పథకాలు తీసుకురాలేదు.. గ్యారంటీల పేరుతో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది.. మభ్య పెడుతుందని కిషన్ రెడ్డి అన్నారు.
Read Also: Republic Day Celebrations: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు..
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. గొప్ప రాజ్యంగం అందించిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం మనది.. అన్ని వర్గాలకు సమానత్వం అంబేద్కర్ రాజ్యాంగం ప్రసాదించిందని తెలిపారు. రాజ్యాంగంను, అంబేద్కర్ను అడుగడుగున కాంగ్రెస్ అవమాన పరిచింది.. మోడీ రాజ్యాంగం విలువలను దేశ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ను నెహ్రూ ఓడించారు.. కులాల పరంగా రిజర్వేషన్లను వ్యతిరేకించింది నెహ్రూ అని తెలిపారు. అంబేద్కర్కు భారతరత్న ఇవ్వలేదు.. అంబేద్కర్ జాతీయ నాయకుడని లక్ష్మణ్ పేర్కొన్నారు.
Read Also: Female Hostages Released: హమాస్ బందీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్ మహిళా సైనికులు విడుదల
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!