ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పార్టీ రెబల్ ఎంపీ రాఘురామ కృష్ణం రాజు మరో సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాడు. లేఖ లో వైసీపీ ప్రభుత్వం పై ఎంపీ రాఘు రామ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యధికంగా అప్పులు చేసిందని ఈ సారి లేఖలో ప్రధాన మంత్రికి తెలిపారు. కార్పొరేషన్ల పేరుతో అనేక చోట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకుంటుందని లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్యారంటీ అప్పులు రూ. 1.35 లక్షల కోట్లు దాటిందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మొత్తం అప్పులు రూ. 7 లక్షల కోట్లకు పై గా ఉంటాయని లేఖ ద్వారా ప్రధాని మోడీకి వెల్లడించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు తీసుకుంటే ప్రజలపై తీవ్రమైన భారం పడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. అధిక మొత్తంలో అప్పులు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పై కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు.