ఐపీఎల్ 2024లో భాగంగా.. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. 60 పరుగుల తేడాతో బెంగళూరు గెలుపొందింది. 242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్.. 16 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలవడంపై ఇంకా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. పంజాబ్ బ్యాటింగ్ లో రిలీ రోసో అత్యధికంగా 61 పరుగులు చేశాడు.
KTR : ఆరు నెలల్లో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
పంజాబ్ ఓపెనర్లలో ప్రభ్ సిమ్రాన్ 6 రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు. బెయిర్ స్టో (27) పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత.. శశాంక్ సింగ్ (37) పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన జితేశ్ శర్మ (5) ఇంపాక్ట్ చూపలేకపోయాడు. ఆ తర్వాత లివింగ్ స్టోన్ డకౌట్ అయ్యాడు. సామ్ కరన్ (22), అశుతోష్ శర్మ (8), రాహుల్ చాహర్ (5), అర్ష్ దీప్ సింగ్ (4) పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 3 వికెట్లతో చెలరేగాడు. స్వప్నిల్ సింగ్, ఫెర్గుసన్, కర్ణ్ శర్మ తలో రెండు వికెట్లు సాధించారు.
Stone Pelting Attack: ఏర్పేడులో ఆర్.కృష్ణయ్యపై రాయితో దాడి
అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 241 రన్స్ చేసింది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 92 పరుగులు చేశాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్లతో రాణించాడు. ఆర్బీబీ బ్యాటింగ్లో.. రజత్ పాటిదార్ 55, కామెరాన్ గ్రీన్ 46 పరుగులతో కీలక ఇనింగ్స్ ఆడారు. డుప్లెసిస్ (9), విల్ జాక్స్ (12), దినేష్ కార్తీక్ (18), స్వప్నిల్ సింగ్ (1) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు, విధ్వత్ కవెరప్ప 2 వికెట్స్ తీశాడు. ఆ తర్వాత అర్ష్దీప్ సింగ్, సామ్ కర్రన్ తలో వికెట్ సాధించారు.