Minister RK Roja: పవన్పై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. నీ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలి
Minister RK Roja: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమ్మాయిల అదృశ్యంపై చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపాయి.. ఇక, ఆంధ్రప్రదేశ్లో తప్పిపోయిన అమ్మాయిలు, మహిళలపై కేంద్ర ప్రభుత్వం లెక్కలు బయటపెట్టడంతో.. మరోసారి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది జనసేన.. అయితే, జనసేనాని పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఆర్కే రోజా.. ఈ సందర్భంగా మాడియాతో మాట్లాడారు.. పవన్ కల్యాణ్ఫై కీలక వ్యాఖ్యలు చేశారు.. పవన్ కల్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలంటూ బాంబ్ పేల్చారు.. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ.. పవన్ కల్యాణ్కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి రోజా.
Read Also: Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
ఇక, హెరిటేజ్ లో గంజాయి.. నారావారిపల్లిలో ఎర్రచందనం దొరుకుతోంది అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి రోజా.. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకడం లేదన్నారు. మరోవైపు.. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడే అంటూ మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై గురువారం కూడా మంత్రి ఆర్కే రోజా విరుచుకుపడ్డారు. చంద్రబాబుది 420 విజన్ అని, ప్రజలకు ఉపయోగపడే విజన్ ఏ నాడైన కనిపెట్టారా.. అమ్మఒడి , రైతు భరోసా, నేతన్న నేస్తం మీ పాలనలో ఎందుకు చేయలేదని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఏనాడు లేదని మంత్రి విమర్శించారు. సీఎం జగనన్న తండ్రికి మించిన తనయుడిగా ప్రజాదరణ అందుకుంటున్నారని.. పాదయాత్రలో ప్రజలు కష్టాలు దగ్గర నుంచి చూసి, అధికారంలో రాగానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. రాజధాని ప్రాంతంలో 50 వేల ఇళ్లకు శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ మంత్రి ఆర్కే రోజా మండిపడిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!