Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. వరద సాయం, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపుపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Cabinet: తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు అతలాకుతలం చేశాయి. ఈనేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వ్యవసాయ రంగం, ముంపు ప్రాంతాల్లో తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామన్నారు. భారీ వర్షాలతో పాటు ముప్పైకి పైగా అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. చాలా జిల్లాల్లో పంట నష్టం కూడా జరిగింది.
ఈ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ముంపు గ్రామాల ప్రజలకు ఆర్థిక సాయం, ఇతర అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్రంలో వరదల కారణంగా జరిగిన నష్టంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారం చర్చించబడుతుంది. రోడ్ల పునరుద్ధరణ చర్యలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై చర్చించనున్నారు.
Also Read
- Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
Read also: Health Department: వెంటనే విధుల్లో చేరండి.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
గత రెండు రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. శుక్రవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ముందుజాగ్రత్త చర్యగా ఈరోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రంలో 8 మంది చనిపోయారు. శుక్రవారం ఉదయం 8:30 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో ములుగు జిల్లాలో 649.8 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా అత్యధికంగా 24 గంటల వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది. తెలంగాణ రాష్ట్రం ఇదే కాలంలో సగటు వర్షపాతం 97.7 మిల్లీమీటర్లు కురిసింది, ఇది మునుపటి ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.
తాజావార్తలు
-
AP Schools Reopen: నేటి నుంచే బడి గంట.. 2026-27 అకడమిక్ క్యాలెండర్ విడుదల.. హాలిడేస్ లిస్ట్ ఇదే!
-
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
JR NTR : ఎన్టీఆర్ లైనప్లో ఊహించని ట్విస్ట్.. స్టార్ డైరెక్టర్తో సినిమా రెండేళ్లు పోస్ట్పోన్
-
Hyderabad: బయట లగ్జరీ.. లోపల పురుగులు.. గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ అసలు రంగు బట్టబయలు..
ట్రెండింగ్
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!