Minister Nadendla Manohar: పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు..
- పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు..
- పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో.. పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు..
- పదవులు మనకొచ్చాయి.. మనకోసం పని చేసిన జనసైనికులు.. వీర మహిళలను మరువద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో అధినేత పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని ప్రశంసలు కురిపించారు జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా సత్కారం చేశారు.. ఆ తర్వాత అంతా కలిసి పవన్ కల్యాణ్ను సత్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు.. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని సూచించారు.. పదవులు మనకొచ్చాయి.. కానీ, మనకోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
Read ALso: Puja Khedkar : రైతును తుపాకీతో బెదిరించిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి.. పోలీసులకు భయపడి పరార్
Also Read
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
- Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు నాదెండ్ల మనోహర్.. నిజాయితీగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసిందని విమర్శించారు.. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం. ప్రభుత్వంలో ప్రతి జనసైనికుడూ భాగస్వామే. ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై అవగాహన పెంచుకోవాలి.. ప్రజలకు వివరించాలి. ఇది మన ప్రభుత్వం.. పార్టీకి.. పవన్కు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలి. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పని చేయాలి. గత ఎన్నికల్లో ప్రజలు సైలెంటుగా ఓటేశారు. ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బయటపడని ప్రజలు.. ఎన్నికల్లో తామేంటో చూపించారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?