Minister Nadendla Manohar: పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు..
- పవన్ కల్యాణ్ పై మంత్రి నాదెండ్ల ప్రశంసలు..
- పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో.. పవన్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారు..
- పదవులు మనకొచ్చాయి.. మనకోసం పని చేసిన జనసైనికులు.. వీర మహిళలను మరువద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nadendla Manohar: పార్టీని అంచెలంచెలుగా పెరిగేలా చేయడంలో అధినేత పవన్ కల్యాణ్ చాలా ఓపికతో.. వ్యూహంతో వ్యవహరించారని ప్రశంసలు కురిపించారు జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్.. పార్టీ తరపున గెలిచిన ప్రజా ప్రతినిధులను ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా సత్కారం చేశారు.. ఆ తర్వాత అంతా కలిసి పవన్ కల్యాణ్ను సత్కరించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఉన్నాం.. మిత్రపక్షాలతో సమన్వయంతో వెళ్లాలన్నారు.. క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బంది.. మచ్చ రాకుండా అందరూ పని చేయాలని సూచించారు.. పదవులు మనకొచ్చాయి.. కానీ, మనకోసం పని చేసిన జనసైనికులు, వీర మహిళలను మరువద్దు అన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి. పార్టీ మీద, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెడతారు.. తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
Read ALso: Puja Khedkar : రైతును తుపాకీతో బెదిరించిన ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి.. పోలీసులకు భయపడి పరార్
Also Read
- Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
- 9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
- Astrology: సెప్టెంబర్ 8 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
- New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన పెంచుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు నాదెండ్ల మనోహర్.. నిజాయితీగా పని చేయాలన్నారు. గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో దోపిడీ చేసిందని విమర్శించారు.. త్వరలో క్రియాశీల సభ్యత్వాన్ని ప్రారంభించనున్నాం. గతంలో తక్కువ సంఖ్యలోనే క్రియాశీలక సభ్యులను చేర్పించాం. ఇప్పటి వరకు సుమారు కార్యకర్తలకు ఆర్థిక సాయం కింద రూ. 18 కోట్లు అందించాం. ప్రభుత్వంలో ప్రతి జనసైనికుడూ భాగస్వామే. ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై అవగాహన పెంచుకోవాలి.. ప్రజలకు వివరించాలి. ఇది మన ప్రభుత్వం.. పార్టీకి.. పవన్కు మంచి పేరు వచ్చే విధంగా పని చేయాలి. పవన్ కళ్యాణ్ టీం అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా పని చేయాలి. గత ఎన్నికల్లో ప్రజలు సైలెంటుగా ఓటేశారు. ఎన్నికల ముందు వరకు ఏ మాత్రం బయటపడని ప్రజలు.. ఎన్నికల్లో తామేంటో చూపించారని వ్యాఖ్యానించారు మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Telangana Degree PG Colleges Bandh: నేడు డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్.. ఎందుకంటే?
-
9/11 Attacks: 2,976 మంది ప్రాణాలు బలిగొన్న ఉగ్రదాడులు.. వెలుగులోకి సౌదీ మాజీ ఏజెంట్ షాకింగ్ వీడియోలు..
-
Astrology: సెప్టెంబర్ 8 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్న్యూస్..
-
Dhanush Mythological Film: ధనుష్ కోసం రాజమౌళి తండ్రి రంగంలోకి.. భన్సాలీ సినిమాకు పౌరాణిక కథ!
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!