Minister Botsa Satyanarayana: అధికారం కాదు.. విలువలు ముఖ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana: అధికారం కాదు.. విలువలు ముఖ్యం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పందించిన ఆయన.. అధికారం ముఖ్యం కాదు.. నైతిక విలువలు ముఖ్యం అని హితవు పలికారు.. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పొత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా.. 175 స్థాలనాలకు 175 స్థానాలను వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు.. 4 సిద్ధం సభలు విజయవంతం మా పార్టీ బలంగా తెలిపిన బొత్స.. వారం రోజులుగా ఈ రాష్ట్రంలో పొత్తుల కోసం టీడీపీ, సెలబ్రిటీ పార్టీ తహతహలాడాయి అని ఎద్దేవా చేశారు.. ప్రజాస్వామ్యంలో పొత్తులు సహజం.. కానీ, 14ఏళ్ల పాలించిన చంద్రబాబు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అనడం జుగుప్స కలిగిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, NTRకు వెన్నుపోట్లు పొడిచారని.. అమరావతి రైతుల ఆకాంక్షలను దెబ్బ తీశారని మూడు నెలల క్రితం బీజెపీ నేతలు మాట్లాడారు.. పొత్తులు పెట్టుకున్నప్పుడు రాష్ర్ట ప్రయోజనాల సంగతి ఏదీ..? అని నిలదీశారు.
Read Also: Oppenheimer OTT: ఏడు అవార్డులతో సత్తా చాటిన సినిమా వచ్చేది ఈ ఓటీటీలోనే.. గెట్ రెడీ
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ఇక, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై బీజెపీ, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు బొత్స.. చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మేదర మెట్ల సభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడితే వక్రీకరిస్తున్నారన్న ఆయన.. ముఖ్యమంత్రి ధైర్యానికి నిన్న బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు నిదర్శనం అన్నారు. నిన్నటి సభకు వచ్చిన జనం గ్రాఫిక్స్ అనే విమర్శలు పచ్చకామెర్లు వచ్చిన వాళ్ళలా వున్నాయని మండిపడ్డారు.. చంద్రబాబును అదే భ్రమలో వుండమనండి.. ప్రజలే నిర్ణయం ఇస్తారని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై బీజెపీ నాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్ రెడ్డి ఎవరు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడిన టైం వేస్ట్ అన్నారు. ప్రజలతోనే మా పొత్తు.. పార్టీలతో కాదని స్పష్టం చేశారు. మూడు పార్టీలు కాదు కదా 30 పార్టీలు వచ్చినా మమ్మల్ని ఎదుర్కోలేవను అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సిద్ధం సభలు తర్వాత రాష్ట్రంలోని 175 సీట్లు మావేననే నమ్మకం కుదిరిందన్నారు. ఈ రాష్ట్రంలో బీజెపీ, టీడీపీ ఉన్నాయా..? అంటూ ఎద్దేవా చేశారు.. ఎన్నికల ప్రచారంపై వెయిట్ అండ్ సీ.. ప్రణాళికలు రూపొందిస్తున్నాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
తాజావార్తలు
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!