Kurnool District: బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే!
- బీజేపీలో చేరిన కొడుమూరు మాజీ ఎమ్మెల్యే
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పురంధేశ్వరి
- బీజేపీ తీర్థం పుచ్చుకున్న గన్నవరం సర్పంచ్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కొడుమూరు మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ బీజేపీ కండువా కప్పుకున్నారు. పరిగెలకు పురంధేశ్వరి పార్టీ కండువా కప్పి, సాధరంగా ఆహ్వానించారు. గన్నవరం సర్పంచ్ కూడా పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభంలో పలు జిల్లాల కాంగ్రెస్, వైసీపీ నేతలు బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోడీ మంచి పాలన కారణంగానే చాలా మంది బీజేపీలో చేరుతున్నారన్నారు.
Also Read: Devineni Avinash: నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు!
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
‘సంస్ధాగతంగా మోర్చాలను బలోపేతం చేసుకుంటున్నాం. 2047 నాటికి వికసిత్ భారత్ కోసం పని చేస్తున్నాం. బీజేపీ మూల సిద్ధాంతం అంత్యోదయ. మహిళ, రైతు, యువతను అభివృద్ధి పథంలో నడిపించగిలితే వికసిత్ భారత్ వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా 10 లక్షల మందికి బీజేపీ ఉపాధి కల్పించింది. రాష్ట్రం ఇచ్చే సొమ్ము ఆలస్యం అవుతుందేమో కానీ.. కేంద్రం ఇచ్చేది వెంటనే రైతుల ఖాతాలకు వెళ్లిపోతుంది. నిన్న మొన్నటి వరకూ చట్టబద్ధత లేని బీసీ కమిషన్కు ప్రధాని మోడీ చట్టబద్ధత కల్పించారు. బీజేపీ సంపూర్ణంగా అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారని విపక్షాలు ఎన్నికల సమయంలో ప్రచారం చేశారు. వాజ్ పేయ్ ప్రయత్నంతోనే అంబేద్కర్కు భారతరత్న ఇచ్చారు. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్లనే ఈ స్ధాయికి ఎదిగాను అని ప్రధాని మోడీ అన్నారు. 22 రాజ్యాంగ సవరణలు బీజేపీ అధికారంలో ఉండగా చేస్తాం’ అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!