Devineni Avinash: నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు!
- మాజీమంత్రి దేవినేని నెహ్రూ71వ జయంతి
- ఎన్టీఆర్, వైఎస్ఆర్ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారు
- నెహ్రూకి పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీఆర్, వైఎస్ఆర్ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు, నెహ్రూ గారి తనయుడు దేవినేని అవినాష్ నివాళులు అర్పించారు.
‘నెహ్రూ గారి 71వ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. నాకు అన్ని విధాలుగా అండగా నిలిచే మెరుగు నాగార్జున, కైలా అనిల్ కుమార్ ఈ జయంతి కార్యక్రమాలలో పాల్గొనటం ఆనందంగా ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నెహ్రూ ప్రజలకు సేవలు అందించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ను నెహ్రూ ఎంతో ప్రేమించారు. నెహ్రూకి రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారు. నాకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారు. నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగింది. ప్రజలకు అన్ని విధాల అండగా ఉంటూ పథకాలు అమలు చేశాం. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే లాగ కృషి చేస్తాం. నెహ్రూ ఆశయ సాధనకు కష్టపడి పనిచేస్తాం’ అని దేవినేని అవినాష్ చెప్పారు.
Also Read
- AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
- Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ 'స్పైసీ చిల్లీ ఎగ్'.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
- Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఎంట్రీ.. డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం!
‘నెహ్రూ లాంటి నాయకుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరొకడు లేడు. దాదాపు ముప్ఫై సంవత్సరాల పాటు శాసన సభ్యులుగా ఉన్నారు. నెహ్రూ దగ్గరకు వెళ్తే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ప్రజలు నమ్ముతారు. అవినాష్ని వైఎస్ జగన్ ఎంతో ప్రేమిస్తారు. నెహ్రూ బాటలోనే అవినాష్ కూడా ప్రజల కోసం కష్టపడి పని చేస్తాడు. అవినాష్కి మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని కైలా అనిల్ కుమార్ చెప్పారు. మాజీమంత్రి మెరుగు నాగార్జున, మాజీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మరియు కార్పొరేటర్లు, వైసీపీ శ్రేణులు దేవినేని నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?