బీజేపీ 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో 11 మంది మాజీ ఎమ్మేల్యేలు, ముగ్గురు మాజీ ఎంపీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు 3 ఎమ్మెల్యే లు ఉన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. దసరా తరవాత రెండో జాబితా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 27 అమిత్ షా వస్తున్నారని, ఈ నెలాఖరున యోగి ఆదిత్య నాథ్ వస్తారని ఆయన తెలిపారు. దసరా తరవాత ప్రచారం ఉదృతం చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Also Read : Director Hari: సింగం డైరెక్టర్ ఇంట తీవ్ర విషాదం
బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకత ను బీజేపీ కి అనుకూలంగా మార్చుకుంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ లకి వ్యతిరేకంగా బీజేపీ నీ ఆశీర్వదించాలని ప్రజల్లో కి వెళ్తామన్నారు. ఇంటింటి కి వెళ్ళాలని ప్రతి ఓటర్ నీ కలవాలని డిసైడ్ చేసామన్నారు. అన్ని నియోజక వర్గాల్లో బీజేపీ సభలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు పాలక పార్టీ బెదిరింపులకు భయపడవద్దు… నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసింది… ఆయనను హృదయ పూర్వకంగా స్వాగతం తెలిపారు. మొదటి లిస్ట్ లో నా పేరు లేకపోవడం పార్టీ అంతర్గత విషయమని కిషన్ రెడ్డి అన్నారు. జనసేన తో పొత్తు ప్రాథమికంగా ఒక సారి కలిశామని, నిర్ణయం తీసుకుంటే చెబుతామన్నారు.
Also Read : World Cup 2023: ఆడిన తొలి మ్యాచ్లోనే అరుదైన ఘనత