వరల్డ్ కప్ 2023లో ఆడిన నాలుగు మ్యాచ్ల్లో అవకాశం లభించలేదు. కానీ హార్థిక్ పాండ్యా న్యూజిలాండ్ మ్యాచ్తో దూరం కావడంతో జట్టులోకి రెండు మార్పులు జరిగాయి. దీంతో ఇద్దరు ఆటగాళ్లకు ఛాన్స్ దొరికింది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్, మరొకరు మహమ్మద్ షమీ ఉన్నారు. అయితే ముందుగా బౌలింగ్ ఎంచుకున్న భారత్ బౌలర్లలో మొదట సిరాజ్ ఒక వికెట్ తీయగా.. రెండో వికెట్ షమీ సాధించాడు.
Read Also: Health Tips : ప్రతి రోజూ పెరుగు తింటున్నారా..? అయితే ఈ విషయాన్ని తప్పక తెలుసుకోవాలి..
ఈ మ్యాచ్లో తన తొలి ఓవర్ మొదటి బంతికే వికెట్ తీశాడు. కివీస్ ఓపెనర్ విల్ యంగ్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఈ వరల్డ్కప్లో షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు వన్డే ప్రపంచకప్లో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వన్డే ప్రపంచకప్లో 32 వికెట్లు సాధించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే(32)ను షమీ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ 44 వికెట్లతో తొలి స్ధానంలో ఉన్నాడు.
Read Also: Pentagon Report: భారత సరిహద్దుల్లో పెరిగిన చైనా సైనిక ఉనికి.. 500కు పైగా న్యూక్లియర్ వార్హెడ్స్..
ఇదిలా ఉంటే.. ధర్మశాలలో న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో భారత్ వరుస విజయాలపై కన్నేసింది. ఈ మ్యాచ్లో కివీస్ జట్టుపై టీమిండియా గెలుపొందితే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్లో ఉండనుంది. మరోవైపు న్యూజిలాండ్పై భారత్ గెలిచిన సందర్భాలు ఎక్కువగా లేవు. చూడాలి మరీ న్యూజిలాండ్పై భారత్ గెలుస్తుందా లేదా అనేది.