Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. జొన్న పంటకు మద్దతు ధర
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల ఏవిధంగా నష్టపోకుండా ఉండేందుకు వారికి అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతుంది. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
Also Read : CM YS Jagan: దివ్యాంగులను అక్కున చేర్చుకున్న సీఎం.. ఏడుగురికి తక్షణమే సాయం..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. 2022-23 యాసంగి సీజన్ లో పండించిన జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
Also Read : GT vs MI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న గుజరాత్ టైటాన్స్
ఈ యాసంగి సీజన్ లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ. 219. 92 కోట్లు తెలంగాణ సర్కార్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జొన్న పంటను కొనుగోలు చేయనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు నిర్ణయంపై రైతన్నలు ధన్యవాదాలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!