Botsa Jhansi Lakshmi: నీతివంతమైన పాలనను సీఎం జగన్ అందించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ లో మరో నెల రోజుల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి విజయం ఎవర్ని వరిస్తుందో అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థినిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
అయితే, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం జగన్ సున్నా వడ్డీతోని ప్రతి అక్కచెల్లమ్మలకు లక్షలాది రూపాయలను అందించారు.. వీటితో పాటు చేయూత, ఆసరా, కాపూ నేస్తంతో పాటు ఇతర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మేర తోడుగా అన్నతమ్ముడిలాగా ఈ నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో సీఎం జగన్ ఒక్కరికి 90 వేల రూపాయలను నేరుగా వారి అకౌంట్లోకి వేశారని తెలిపారు. అలాగే, ఒక్క రూపాయి అయినా సరే అవినీతికి పాల్పడకుండా.. నీతివంతమైన పాలన అందించారు అని ఆమె చెప్పుకొచ్చారు. గతంలో పెన్షన్ కావాలంటే ఎవరైనా చనిపోతే కానీ వచ్చేది కాదు.. అది కూడా పచ్చ చొక్క వేసుకున్న వారు రికమెండేషన్ చేస్తే ఆ పెన్షన్ వచ్చేది అని బొత్స ఝాన్సీ లక్ష్మీ పేర్కొన్నారు.
Read Also: BAAK : పంచుకో అంటున్న హాట్ బ్యూటీస్.. స్పెషల్ సాంగ్ వైరల్..!!
కానీ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరి ఇంటికి వెళ్లి మరీ సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది అని బొత్స ఝాన్సీ లక్ష్మీ తెలిపారు. ప్రజలు ఒక్కసారి ఆలోచించి.. మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయితే.. పేదల ప్రభుత్వం వస్తుంది, ధర్మప్రభుత్వం వస్తుంది, నీతివంతమైన పాలన వస్తుందని చెప్పుకొచ్చారు. పొరపాటున కూడా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే.. అధర్మ పరిపాలన రావడంతో కరువు తాండవీస్తుంది, అవినీతిమైతుందన్నారు. మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తాను అని జగన్ తెలిపారు.. అందువల్ల మన పిల్లల భవిష్యత్ బంగారు మయం అవుతుందన్నారు. విశాఖను రక్షించుకుందాం.. కూటమిని తరిమికొడుదాం అంటూ పిలుపునిచ్చారు. ప్రజలు పిలిస్తే పలికే మన వాసుపల్లి గణేష్ ను కూడా గెలిపించాలన్నారు. అలాగే, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేద్దాం.. జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకుందామని విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మీ కోరారు.
తాజావార్తలు
-
KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..