West Bengal: మరో రెండ్రోజుల్లో ఎన్నికలు.. పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్లో బాంబులు కలకలం సృష్టిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల హింసకు పేరుగాంచిన ముర్షిదాబాద్లోని వివిధ ప్రాంతాల్లోని శ్మశాన వాటికలు, పాఠశాలలు, ఐసిడీఎస్ కేంద్రాలు, ఆట స్థలాలలో బాంబ్ స్క్వాడ్ అనేక బాంబులు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు.. బాంబుల తయారీకి సంబంధించిన కొన్ని కెమికల్స్ లభ్యమయ్యాయి. కాగా.. బాంబులు ఉన్నాయన్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.
అయితే.. బాంబులను నిర్వీర్యం చేసేందుకు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్కు పోలీసులు సమాచారం అందించారు. అయితే ఎన్నికలకు ముందు ముర్షిదాబాద్ సెంటర్లోని పలు ప్రాంతాల్లో బాంబులు రికవరీ చేయడంపై యంత్రాంగం ఆందోళన చెందుతోంది. శనివారం ఉదయం పోలీసులు రాయ్పూర్లోని ఖిదిర్పద శ్మశానవాటిక, దోమ్కల్లోని నిశ్చింత్పూర్, ఫర్జిపాడా ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అక్కడ 16 బాంబులు ఉన్నట్లు గుర్తించారు. సాకెట్ బాంబులు, బాంబుల తయారీకి వాడే పదార్థాలను నైలాన్ బ్యాగుల్లో పెట్టి ప్లాస్టిక్ బకెట్లలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Summer Foods for Kids: డీహైడ్రేషన్కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
- Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా 'లెటర్ ఆఫ్ ఇంటెంట్' పై ఇజ్రాయెల్ అనుమానాలు!
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
ఐసీడీఎస్ కేంద్రం వెనుక ప్లాస్టిక్ సంచులలో బాంబులు లభ్యమయ్యాయి. ఆ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ను రప్పించారు. బాంబుల ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మూడో దశలో ముర్షిదాబాద్ జిల్లాలోని జంగీపూర్, ముర్షిదాబాద్ రెండు స్థానాలకు, పొరుగు జిల్లాలోని మాల్దా నార్త్, సౌత్ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. కాగా.. ఈ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగియనుంది.
RCB vs GT: బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు.. తుది జట్లు ఇవే!
మరోవైపు.. బాంబు రికవరీ తర్వాత రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. దొంకల్ జోనల్ కమిటీ కార్యదర్శి ముస్తాఫిజుర్ రహమాన్ మాట్లాడుతూ.. తృణమూల్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. స్వయంగా బాంబులు పెట్టి, ప్రతిపక్షం పేరుతో తప్పుడు కేసులు బనాయిస్తూ పోలీసులకు సమాచారం ఇస్తున్నారన్నారు. ఇదిలా ఉంటే.. రక్తపాతం లేకుండా ఎన్నికలు నిర్వహించాలని తృణమూల్ డోమ్కల్ బ్లాక్ ప్రెసిడెంట్ హాజికుల్ ఇస్లాం తెలిపారు. ప్రజలు అట్టడుగు స్థాయి అభివృద్ధిని చూసి ఓటేస్తారని.. ఎవరినీ భయపెట్టాల్సిన అవసరం లేదని, ‘బాంబు సంస్కృతి’ అసలు ప్రతిపక్షాలదేనని అన్నారు. అక్కడక్కడ బాంబులు పెట్టి పోలీసులకు సమాచారం ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు.
ఎన్నికల ప్రకటన వెలువడినప్పటి నుంచి ముర్షిదాబాద్ లోక్సభ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చోటుచేసుకున్నాయి. అందుకే ముర్షిదాబాద్పై కమిషన్ అదనపు నిఘా పెట్టింది. మూడో రౌండ్ ఓటింగ్లో కూడా ముర్షిదాబాద్లో అత్యధిక కేంద్ర బలగాలు ఉంటాయని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి 190 కంపెనీల సెక్యూరిటీ గార్డులను నియమించనున్నారు.
తాజావార్తలు
-
UPSC Exam Calendar 2027: UPSC పరీక్షల క్యాలెండర్ 2027 విడుదల.. కీలక పరీక్షల తేదీలు ప్రకటించిన కమిషన్
-
Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్కప్లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
-
Trump – Netanyahu: ఇరాన్ విషయంలో అమెరికా – ఇజ్రాయెల్ మధ్య ఓపెన్ వార్.. ట్రంప్ ఫోన్ కాల్తో నెతన్యాహు ఫైర్!
-
Explained: జోక్గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!