Bhatti Vikramarka: చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
Kishan Reddy: తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు..
Also Read
- Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
- CJP: "ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే".. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
- Sharad Pawar: "మోడీ నా మాట విన్నారు".. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
కావలసినంత నాణ్యమైన విద్యుత్తు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పి భారీ ప్రాజెక్టులపై పంప్ స్టోరేజ్ కి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరు రాలేదని తెలిపారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో సింగరేణిలో బొగ్గు పత్తిని 67 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచుతాం.. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది.. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది కార్మికులు నష్టపోయారని డిప్యూటీ సీఎం తెలిపారు.
PM Modi: మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
సీఎల్పీ నేతగా ప్రతి సభలోను ఆ అంశాన్ని ప్రశ్నించినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యము లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిలో ప్రారంభించిన సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రాష్ట్రానికే కాదు దేశానికి దిశా నిర్దేశం అని తెలిపారు. సింగరేణి సంపదను రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు పంచుతామని అన్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని కేసిఆర్ ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజలు కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని తీర్పునిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ సర్కారు విఫలం చెందితే బాగుండు అని కొందరు మిత్రులు కలలు కంటున్నారని చెప్పారు.
తాజావార్తలు
-
Abhijeet Dipke: నా కొడుకు కష్టానికి ఫలితం దక్కింది.. అభిజిత్ దీప్కే తల్లి ఆనందం
-
CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
VVS Laxman: గౌతమ్ గంభీర్ విరామం.. భారత డ్రెస్సింగ్ రూమ్ స్వరూపాన్నే మార్చేసిన వివిఎస్ లక్ష్మణ్..
-
Sharad Pawar: “మోడీ నా మాట విన్నారు”.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనక శరద్ పవార్..
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!