Kishan Reddy: తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెదక్ జిల్లా తూప్రాన్లో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం విజయ సంకల్ప యాత్రలతో రాష్ట్రమంతా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. దేశానికి మోడీ ఎంతో సేవ చేశారు.. టాయిలెట్ నుండి చంద్రయాన్ వరకు నరేంద్ర మోడీ చేయని అభివృద్ది కార్యక్రమం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా ఇళ్లు, గ్యాస్, బియ్యం అందించారని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పేదలకు రూ.5లక్షల ఆరోగ్య భీమా అందించారు.. జాతీయ రహదారుల నిర్మాణం, గ్రామ పంచాయితీలలో అభివృద్దికి కేంద్రం నిధులు ఇస్తుందని అన్నారు. ఏడాదికి రైతులకు మోడీ రూ. 6 వేల ఇస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.
PM Modi: మంగళగిరి ఎయిమ్స్ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్ను స్పష్టం చేసిన మోడీ
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
హైదరాబాద్ తో సహా దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద దాడులు జరిగేవి.. దేశాన్ని మోడీ శాంతియుత దేశంగా మార్చారని తెలిపారు. పాక్ ఉగ్రవాదుల ఆటకట్టించారు.. పదేళ్లుగా దేశం శాంతియుతంగా ఉంది.. దేశంలో అందరూ సంతోషంగా ఉంటున్నారు.. దానికి కారణం మోడీనేనని కిషన్ రెడ్డి తెలిపారు. దేశం మొత్తం మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో 17 సీట్లను గెలిచే ప్రయత్నం చేస్తు్న్నాం.. తెలంగాణ ప్రజలు మోడీ నాయకత్వం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కథ ముగిసింది.. ఆ పార్టీ తెలంగాణకు అవసరం లేదని ఆరోపించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అవినీతికి పెట్టింది పేరు కాంగ్రెస్.. ఆ పార్టీ నేతలు అవీనితి పరులని దుయ్యబట్టారు. కాంగ్రెస్ కు ఉన్న 40 సీట్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు రావని విమర్శించారు.
TS Inter Hall Tickets: తెలంగాణ ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండిలా..!
దేశం గాడీలో ఉండాలంటే, మన పిల్లల భవిష్యత్ బాగుండాలంటే మోడీ నాయకత్వాన్ని ఆశీద్వారించాలని కిషన్ రెడ్డి కోరారు. రాజకీయాలకు అతితంగా ఆలోచన చేయండి.. మెదక్ పార్లమెంట్ లో బీజేపీ గెలవాలని కిషన్ రెడ్డి అన్నారు. దేశంలో అనేక సమస్యలను మోడీ పరిష్కారించారు.. అవీనితి లేని పాలన అందిస్తు్న్నారని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా యూరియా ధరలు పెరిగాయి.. కానీ పెరిగిన ధరలను కేంద్రమే సబ్సీడిగా భరిస్తుందని చెప్పారు. తెలంగాణలో రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చేస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలకు దిక్కు లేదు.. వాళ్ళు ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారని మండిపడ్డారు. మాట తప్పిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు వదిలిపెట్టారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో 4 ఎంపీ సీట్లు బీజేపీ గెలువబోతుంది.. ఇక కర్ణాటకలో గ్యారంటీల పేరుతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని.. ఇప్పుడు కర్ణాటక బీజేపీ వైపు ఉంది 25 ఎంపీ సీట్లను బీజేపీ గెలువబోతుందని అన్నారు. తెలంగాణలో అదే పరిస్థితి అని చెప్పారు. దేశంలో అభివృద్ది చెందాలంటే మోడీ మళ్లీ రావాలి.. ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.
- Tags
- bjp
- BRS
- congress
- Kishan Reddy
- Loksabha
తాజావార్తలు
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
-
Janhvi Kapoor Marriage : జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ పెళ్లి చేసుకున్నారా?
-
Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
-
IND vs AFG T20 Series: భారత్-అఫ్గాన్ టీ20 సిరీస్కు ముందే వివాదం.. పాకిస్థాన్ సంస్థకు కీలక హక్కులు!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!