Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి తిరుగుబాటు? స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం
- మీడియా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తోంది
- దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాం
- చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
- తాత్కాలిక అధినేత యూనస్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.
READ MORE: South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
తాజాగా ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సైతం ఈ అంశంపై స్పందించారు. తప్పుడు కథనాలను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఏకంగా ఐక్యరాజ్య సమితి సహకారాన్ని కోరామన్నారు. ఇటీవల తమ దేశంలో పర్యటించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దీనిపై సానుకూలంగా స్పందిస్తూ.. హామీ ఇచ్చినట్లు తెలిపారు. “బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం గద్దె ఎక్కినప్పటి నుంచి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఓ వైపు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు ఈ తప్పుడు వార్తల ప్రసారం పెరుగుతోంది. ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయినవారు ఈ వదంతులను ఆయుధాలుగా మలచుకొంటున్నారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. ప్రజలు సైతం గమనిస్తున్నారు. కొందరూ ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. మనందరి ఐక్యత వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” అని తాత్కాలిక అధినేత యూనస్ వెల్లడించారు.
READ MORE: SRH vs LSG: లక్నోలో స్టార్ పేసర్ ఎంట్రీ.. సన్రైజర్స్ను ఆపేనా! తుది జట్లు ఇవే
తాజావార్తలు
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!