Bangladesh: బంగ్లాదేశ్లో మరోసారి తిరుగుబాటు? స్పందించిన తాత్కాలిక ప్రభుత్వం
- మీడియా తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తోంది
- దీనిపై ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేశాం
- చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు
- తాత్కాలిక అధినేత యూనస్ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతేడాది ఆగస్టు నెలలో షేక్ హసీనా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ప్రధాని పదవిని వీడిన ఆమె భారత్లో తలదాచుకునేందుకు వచ్చారు. ప్రస్తుతం మన దేశంలోనే ఆశ్రయం పొందుతున్నారు. అయితే.. హసీనా ప్రభుత్వ పతనం అనంతరం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మరోసారి తిరుగుబాటు జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఈ కథనాలపై స్పందించిన బంగ్లా సైన్యం ఇప్పటికే తీవ్రంగా ఖండించింది.
READ MORE: South Korea: కార్చిచ్చు విధ్వంసం.. 24కు చేరిన మృతుల సంఖ్య..
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
- OLA New EV: సర్వీస్ కష్టాలు తీరాయి.. సరికొత్త ఈవీ వాహనాలతో దూసుకురానున్న 'ఓలా ఎలక్ట్రిక్'..
- UP: పిలవని పేరంటానికి కాంగ్రెస్ నేతలు.. షాక్ ఇచ్చిన మాయావతి..
తాజాగా ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ సైతం ఈ అంశంపై స్పందించారు. తప్పుడు కథనాలను అరికట్టేందుకు కీలక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఏకంగా ఐక్యరాజ్య సమితి సహకారాన్ని కోరామన్నారు. ఇటీవల తమ దేశంలో పర్యటించిన ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ దీనిపై సానుకూలంగా స్పందిస్తూ.. హామీ ఇచ్చినట్లు తెలిపారు. “బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం గద్దె ఎక్కినప్పటి నుంచి మీడియాలో తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నారు. ఓ వైపు.. ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోవైపు ఈ తప్పుడు వార్తల ప్రసారం పెరుగుతోంది. ప్రజా తిరుగుబాటుతో అధికారం కోల్పోయినవారు ఈ వదంతులను ఆయుధాలుగా మలచుకొంటున్నారు. ఈ కథనాల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. ప్రజలు సైతం గమనిస్తున్నారు. కొందరూ ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. మనందరి ఐక్యత వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.” అని తాత్కాలిక అధినేత యూనస్ వెల్లడించారు.
READ MORE: SRH vs LSG: లక్నోలో స్టార్ పేసర్ ఎంట్రీ.. సన్రైజర్స్ను ఆపేనా! తుది జట్లు ఇవే
తాజావార్తలు
-
Peddi Censor Review : ‘రంగస్థలం’ను మించిన యాక్టింగ్…. లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
-
Acer Aspire 5 AI Laptop: 32GB ర్యామ్, 14-అంగుళాల డిస్ప్లేతో.. ఏసర్ కొత్త ఆస్పైర్ 5 ల్యాప్టాప్ విడుదల
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!