Bandi Sanjay : బీఆర్ఎస్ అధినాయకుడికి దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది
- కరీంనగర్: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- బీఆర్ఎస్ అధినాయకుడికి బీదర్లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది
- దొంగనోట్లు వ్యాపారం చేసి ఎన్నికల్లో దొంగనోట్లు పంచారు :బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీలను తీవ్రంగా విమర్శించారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కు బీదర్లో దొంగనోట్ల ముద్రణ ప్రెస్ ఉందని సంచలన ఆరోపణలు చేశారు. అక్కడ ముద్రించిన నకిలీ నోట్లే ఎన్నికల సమయంలో పంపిణీ చేసినట్లు ఆరోపించారు. తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అప్పులపాలైందని, ప్రస్తుతం రాష్ట్రంపై రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పు ఉందని ప్రభుత్వమే అంగీకరిస్తోందని తెలిపారు. ప్రభుత్వ భూములు అమ్మకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని, కమీషన్ల వ్యవస్థ మరింత పెరిగి 15 నుంచి 18 శాతానికి చేరిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఆ హామీలను అమలు చేయడానికి కనీసం రూ.8 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని విమర్శించారు. కాంగ్రెస్ విధానాలను చూస్తే మరికొన్ని నెలల్లో ఉద్యోగులకు జీతాల కోసం కూడా తీవ్ర సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి గట్టి ప్రతిస్పందన ఎదురవుతుందని బండి సంజయ్ హెచ్చరించారు. రైతుల కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం బాగుపడదని, రైతులు నిశ్చయిస్తే ప్రభుత్వాలే మార్చగలరని అన్నారు. నరేంద్రమోడీ (PM Modi) నేతృత్వంలోని NDA ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎఫ్పీవో (FPO) వ్యవస్థను మరింత బలోపేతం చేయడం అవసరమని ఆయన తెలిపారు.
Also Read
- YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
తాజావార్తలు
-
YS Jagan-DSC: 270 మందికి అనుమానాస్పదంగా ఉద్యోగాలు.. సీబీఐ విచారణతోనే నిజాలు బయటకు!
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..