KTR: సమావేశం అనంతరం బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. తమ ఉద్దేశాన్ని ప్రకటించిన కేటీఆర్
- తెలంగాణ భవన్ లో కేటీఆర్.. హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం
- అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీలు హాజరు
- రుణమాఫీపై ప్రధానంగా చర్చ
- మీటింగ్ అనంతరం కేటీఆర్ చిట్ చాట్
- సీఎంపై సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భవన్ లో కేటీఆర్, హరీష్ రావుల ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన రుణమాఫీపై ప్రధానంగా చర్చించారు. అనంతరం బీఆర్ఎస్ సమావేశంపై కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రభుత్వం చెప్పిన విధంగా అందరికీ రుణమాఫీ జరగలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రుణమాఫీ అంశంపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తామని వెల్లడించారు. రెండు రోజుల్లో వివరాల సేకరణ ప్రారంభిస్తామని తెలిపారు. కలెక్టర్ లకు, సీఎస్ కు డేటా ఇస్తామని చెప్పారు. మా ఉద్దేశ్యం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాదని తెలిపారు. ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కోసమే తాము డేటా ఇస్తున్నామన్నారు. హరీష్ రావు ఆఫీసు పై దాడి చేశారని.. అటెన్షన్ డైవర్షన్ కోసం ఇలా చేస్తున్నారన్నారు.ఎల్లుండి నుంచి డేటా సేకరణ మొదలు పెట్టి వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు.
READ MORE: Rajasthan: విద్యార్థుల మధ్య గొడవ, కత్తి పోట్లు.. ఉదయ్పూర్లో మతహింస..
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
నిన్న సీఎంకు అనుకూలంగా ఉండే ఒక మీడియా ప్రభుత్వ అధికారిపై దాడి చేసేటంత పని చేశారని మాజీ మంత్రి ఆరోపించారు. హోమ్ మంత్రి గా ఉన్న రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “నాకు ఢిల్లీ నుంచి ఒక సమాచారం వచ్చింది. రేవంత్ రెడ్డి రాజకీయ అరంగేట్రం ఏబీవీపీ నుంచే ప్రారంభించారు. చనిపోయే నాటికి బీజేపీలోనే ఉంటానని మోడీకి చెప్పారట. తాను చనిపోయే టైంకి తన మీద బీజేపీ జెండా ఉంటుంది అని మోడీ కి మాట ఇచ్చారట. అలా చెప్పారో లేదో రేవంత్ రెడ్డి సమాధనమివ్వాలి. ” అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!