Tamil Nadu: ఊర్లో నుంచి పారిపోయిన ప్రేమ జంట.. అబ్బాయి తల్లిని ఏం చేశారంటే..!
- తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి
- మంగళవారం రాత్రి పారిపోయిన ఓ ప్రేమజంట
- ఆగ్రహానికి గురై యువకుడి తల్లిని తీసుకొచ్చిన అమ్మాయి పేరెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు. ఓ మీడియా కథనం ప్రకారం.. యువతి యువకుడితో పారిపోయిన విషయం తెలిసిన వెంటనే.. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తల్లిని తమ వద్దకు తీసుకొచ్చారు. తన తల్లి వార్త విని యువకుడు ఎక్కడ ఉన్న ఇక్కడకు వస్తాడని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు పోలీసు బృందాలు ప్రేమజంటను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
Assam: విద్యార్థుల నుంచి వ్యతిరేకత.. మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
ఓ వైపు పోలీసులు అబ్బాయి, అమ్మాయి కోసం వెతుకుతుండగా.. మరోవైపు అమ్మాయి బంధువులు కూడా వారి కోసం గాలిస్తున్నారు. 23 ఏళ్ల యువతి గౌండర్ (ఓబీసీ) వర్గానికి చెందినది. ఆమె 24 ఏళ్ల ప్రియుడు బెంగళూరులో చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అమ్మాయి కనపడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ బాగా చదువుకున్నారు. అబ్బాయి వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశాడు. కాగా.. అమ్మాయి కుటుంబీకులు యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారు అతనిని ఫోన్లో సంప్రదించలేకపోయారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని తల్లి తీసుకొచ్చారు.”అని తెలిపారు.
Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఈసీ ప్రకటన
బుధవారం ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పక్క గ్రామంలో ఉన్న యువకుడి ఇంటికి వెళ్లారు. “కొడుకు పారిపోయాడని తెలుసుకున్న యువకుడి తల్లి కూడా షాక్కు గురైంది. కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ.. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అమ్మాయి తండ్రి అబ్బాయి తల్లిని తీసుకెళ్లాడు.” అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!