Tamil Nadu: ఊర్లో నుంచి పారిపోయిన ప్రేమ జంట.. అబ్బాయి తల్లిని ఏం చేశారంటే..!
- తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి
- మంగళవారం రాత్రి పారిపోయిన ఓ ప్రేమజంట
- ఆగ్రహానికి గురై యువకుడి తల్లిని తీసుకొచ్చిన అమ్మాయి పేరెంట్స్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు. ఓ మీడియా కథనం ప్రకారం.. యువతి యువకుడితో పారిపోయిన విషయం తెలిసిన వెంటనే.. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తల్లిని తమ వద్దకు తీసుకొచ్చారు. తన తల్లి వార్త విని యువకుడు ఎక్కడ ఉన్న ఇక్కడకు వస్తాడని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు పోలీసు బృందాలు ప్రేమజంటను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
Assam: విద్యార్థుల నుంచి వ్యతిరేకత.. మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
Also Read
- Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
- Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
- Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
- UP: యూపీలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ పర్యటన.. షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు జరుగుతాయా?
ఓ వైపు పోలీసులు అబ్బాయి, అమ్మాయి కోసం వెతుకుతుండగా.. మరోవైపు అమ్మాయి బంధువులు కూడా వారి కోసం గాలిస్తున్నారు. 23 ఏళ్ల యువతి గౌండర్ (ఓబీసీ) వర్గానికి చెందినది. ఆమె 24 ఏళ్ల ప్రియుడు బెంగళూరులో చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అమ్మాయి కనపడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ బాగా చదువుకున్నారు. అబ్బాయి వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశాడు. కాగా.. అమ్మాయి కుటుంబీకులు యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారు అతనిని ఫోన్లో సంప్రదించలేకపోయారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని తల్లి తీసుకొచ్చారు.”అని తెలిపారు.
Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఈసీ ప్రకటన
బుధవారం ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పక్క గ్రామంలో ఉన్న యువకుడి ఇంటికి వెళ్లారు. “కొడుకు పారిపోయాడని తెలుసుకున్న యువకుడి తల్లి కూడా షాక్కు గురైంది. కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ.. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అమ్మాయి తండ్రి అబ్బాయి తల్లిని తీసుకెళ్లాడు.” అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజావార్తలు
-
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
-
Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!