Cholera: మధ్యప్రదేశ్లో కలరా కలకలం.. ఇద్దరు మృతి, 80 మందికి అస్వస్థత
- మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి
- ఇద్దరు వృద్ధులు మృతి.. 80 మందికి పైగా అస్వస్థత
- నగరంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను బంద్- సీఎంహెచ్వో శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO, భింద్) DK శర్మ మీడియాతో మాట్లాడుతూ.. “నీటిలో ఇన్ఫెక్షన్ కారణంగా, కలరా వ్యాప్తికి సంబంధించిన కొన్ని కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కొంతమంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చేరారు. వారిలో కొంతమంది స్థానిక కమ్యూనిటీ హెల్త్లో చికిత్స పొందారు. ఇప్పటి వరకు మొత్తం 84 మంది రోగులు కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కలరాతో ఇద్దరు వృద్ధులు మరణించారు” అని సీఎంహెచ్వో తెలిపారు.
Read Also: Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
Also Read
నగరంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను బంద్ చేసి ఇతర మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలోని ఇంటిని మొత్తం సర్వే చేసి మందులు, క్లోరిన్ మాత్రలు అందజేశాం.. నీటిని మరిగించిన తర్వాతే తాగాలని ప్రజలకు సూచించినట్లు చెప్పారు. అంతే కాకుండా ఎక్కడైనా నీటి కలుషితాన్ని తొలగించాలని నగర్ పాలికకు చెప్పినట్లు సీఎంహెచ్వో పేర్కొన్నారు. కేవలం కలుషిత నీటి కారణంగానే కలరా వ్యాప్తి జరిగిందని, ఒకసారి శాంపిల్ను పరీక్షించి చూస్తే అసలు విషయం స్పష్టమవుతుందని సీఎంహెచ్వో శర్మ తెలిపారు. మరోవైపు.. అంబులెన్స్లు ఏర్పాట్లు చేశామని, వైద్యుల బృందాన్ని కూడా పెంచామని, ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Madhya Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!