Cholera: మధ్యప్రదేశ్లో కలరా కలకలం.. ఇద్దరు మృతి, 80 మందికి అస్వస్థత
- మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి
- ఇద్దరు వృద్ధులు మృతి.. 80 మందికి పైగా అస్వస్థత
- నగరంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను బంద్- సీఎంహెచ్వో శర్మ
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో కలరా వ్యాప్తి కలకలం రేపుతుంది. ఈ వ్యాధితో ఇద్దరు వృద్ధులు మరణించారు. 80 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని ఆరోగ్య అధికారి బుధవారం తెలిపారు. జిల్లాలోని ఫూప్ టౌన్లోని వార్డు నంబర్ 5, 6, 7లో నీరు కలుషితం కావడంతో ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (CMHO, భింద్) DK శర్మ మీడియాతో మాట్లాడుతూ.. “నీటిలో ఇన్ఫెక్షన్ కారణంగా, కలరా వ్యాప్తికి సంబంధించిన కొన్ని కేసులు నమోదయ్యాయి, ఆ తర్వాత కొంతమంది రోగులు జిల్లా ఆసుపత్రిలో చేరారు. వారిలో కొంతమంది స్థానిక కమ్యూనిటీ హెల్త్లో చికిత్స పొందారు. ఇప్పటి వరకు మొత్తం 84 మంది రోగులు కోలుకొని ఇంటికి తిరిగి వచ్చారు. కలరాతో ఇద్దరు వృద్ధులు మరణించారు” అని సీఎంహెచ్వో తెలిపారు.
Read Also: Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
Also Read
నగరంలో ప్రస్తుతం తాగునీటి సరఫరాను బంద్ చేసి ఇతర మార్గాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతంలోని ఇంటిని మొత్తం సర్వే చేసి మందులు, క్లోరిన్ మాత్రలు అందజేశాం.. నీటిని మరిగించిన తర్వాతే తాగాలని ప్రజలకు సూచించినట్లు చెప్పారు. అంతే కాకుండా ఎక్కడైనా నీటి కలుషితాన్ని తొలగించాలని నగర్ పాలికకు చెప్పినట్లు సీఎంహెచ్వో పేర్కొన్నారు. కేవలం కలుషిత నీటి కారణంగానే కలరా వ్యాప్తి జరిగిందని, ఒకసారి శాంపిల్ను పరీక్షించి చూస్తే అసలు విషయం స్పష్టమవుతుందని సీఎంహెచ్వో శర్మ తెలిపారు. మరోవైపు.. అంబులెన్స్లు ఏర్పాట్లు చేశామని, వైద్యుల బృందాన్ని కూడా పెంచామని, ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Also: Madhya Pradesh: ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకలు స్వైర విహారం..
తాజావార్తలు
-
West Bengal elections: బెంగాల్లో హై డ్రామా.. పోలీసులు కీలక నిర్ణయం..
-
DGP CV Anand : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
-
Bhagwant Mann: మద్యం తాగి అసెంబ్లీకి వచ్చిన సీఎం..?
-
Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!