Mohan Charan Majhi: నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు: మోహన్ మాఝీ భార్య
- నా భర్త సీఎం అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు..
- ఆ సమయంలో మేమంతా టీవీ చూస్తున్నాం..
- మంత్రి అవుతారని మాత్రమే ఊహించా..
- ఒడిశా సీఎం మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohan Charan Majhi: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దశాబ్ధంగా ఒడిశాను పాలిస్తున్న నవీన్ పట్నాయక్ని అధికారాన్ని నుంచి దించింది. అసెంబ్లీలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలోని ఎంపీ స్థానాలను దాదాపుగా క్లీన్స్వీప్ చేసింది. ఇదిలా ఉంటే ఈరోజు ఒడిశా సీఎంగా బీజేపీ ఎమ్మెల్యే మోహన్ చరణ్ మాఝీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఒడిశా రాష్ట్రానికి మూడో గిరిజన ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి తొలి ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ చరిత్ర సృష్టించారు.
తన భర్త ఒడిశా ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని మోహన్ మాఝీ భార్య ప్రియాంకా మాఝీ అన్నారు. తమ కుటుంబ సభ్యులు కూడా దీన్ని ఊహించలేదని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. భువనేశ్వర్లోని ప్రభుత్వ క్వార్టర్స్లో మోహన్ తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. మంగళవారం మాఝీని కొత్త సీఎంగా ప్రకటించడంతో ఒక్కసారిగా వారంతా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. టీవీ ఛానెల్ ద్వారా ఈ విషయం తెలిసిందని, ఆ క్షణం వరకు తన భర్త సీఎం అవుతారని ఎప్పుడూ కూడా ఊహించలేదని ప్రియాంకా చెప్పారు.
Also Read
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
Read Also: Bombay High Court : “భారత్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్ర”.. పీఎఫ్ఐ సభ్యులకు బెయిల్ నిరాకరణ..
బీజేపీ కేబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని మాత్రమే ఊహించానని, ఇది నాకు, తమ కుటుంబానికి ఉత్కంఠభరితమైన క్షణమని చెప్పారు. ఈ ప్రకటన వచ్చే సమయంలో తాము వార్తా ఛానెల్ని చూస్తున్నట్లుగా ఆమె చెప్పారు. తన భర్త ఒడిశాకు, సొంత నియోజకవర్గం కియోంజర్కి మంచి చేస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తన కొడుకు సీఎం కావడం చాలా ఆనందంగా ఉందని మోహన్ మాఝీ తల్లి బలే మాఝీ అన్నారు. యువకుడి ఉన్న సమయంలో ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చాడని, మొదట సర్పంచ్ అయ్యాడని, ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యాడని, ఇప్పుడు సీఎం అయ్యాడని ఆమె అన్నారు.
మా నాన్న సీఎం కావడం నాకు ఆశ్చర్యంగా ఉందని, స్నేహితులు తన నుంచి ట్రీట్ అడుగుతున్నారని 8వ తరగతి చదువుతున్న మాఝీ కుమారుడు కృష్ణ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా మాఝీ సీఎం అయినందుకు మేమంతా సంతోషిస్తున్నామని, ఆయన చాలా వినయపూర్వక వ్యక్తి, ఖచ్చితంగా రాష్ట్రం కోసం పనిచేస్తారని సీఎం పొరుగు వారు చెప్పారు.
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!