Nitish Kumar: “ఇక శాశ్వతంగా ఎన్డీయేలోనే ఉంటా”.. ప్రధాని ముందు నితీష్ కుమార్ వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ ఇండియా కూటమిని కాదని మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి తిరిగి వచ్చారు. ఇండియా కూటమి రూపశిల్పుల్లో ఒకరిగా ఉన్న నితీష్ కూటమి నుంచి వైదొలగడం ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోసారి సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లోని 40 ఎంపీ స్థానాలను స్వీప్ చేయాలని బీజేపీ-జేడీయూ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాయి.
తాజాగా ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ బీహార్లోని జముయిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఒకే వేదికపై పీఎం మోడీ, సీఎం నితీష్ కుమార్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. నితీష్ కుమార్ మాట్లాడుతూ.. తాను శాశ్వతంగా ఎన్డీఏ(నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్)లో ఉంటానని స్పష్టం చేశారు. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకుని మళ్లీ బీజేపీతో కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ‘‘వారు తప్పు చేయడం నేను చూశాను, అందుకే ఆర్జేడీని వదిలేశాను. ఇక ఎప్పటికీ మేము(జేడీయూ-బీజేపీ) కలిసి ఉంటాము’’ అని అన్నారు.
Also Read
- TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
- Mohan Bhagwat: ప్రవర్తనతో భారతీయ కుటుంబాలు ప్రపంచానికి ఆదర్శంగా ఉండాలి
- India On Indus Waters: ఎంత మొత్తుకున్నా నీళ్లు ఇయ్యం.. పాక్కు భారత్ స్పష్టీకరణ..
- US Woman Shocked: అమెరికాలో రూ.85 వేలు, భారత్లో రూ.35 మాత్రమే.. మందుల ధరలపై మహిళ షాక్..
Read Also: Onion Export: ఉల్లి ఎగుమతులపై నిషేధం ఉన్నప్పటికీ.. 5 దేశాలకు మాత్రం అనుమతి..
ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయానని అన్నారు. ‘పీఎం మోడీ 10ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉండీ బీహార్కి, దేశానికి ఎంతో కృషి చేశారు. మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ-ముస్లిం అల్లర్లు ఆగిపోయాయి, మీరు పొరబాటున మళ్లీ ప్రతిపక్షాలకు ఓటేస్తే అల్లర్లు తిరిగి మొదలవుతాయి.’’ అని బీహార్ ముఖ్యమంత్రి అన్నారు. ‘‘ మా డిమాండ్ కర్పూరీ ఠాకూర్కి మీరు భారతరత్నం ప్రదానం చేశారు. దీనిని బీహార్ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.
ఆర్జేడీ 15ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేయలేదని, వారి హయాంలో సాయంత్రం తర్వాత ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని అన్నారు. బీహార్ లోక్సభ స్థానాలకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!