Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగింపు దశకు చేరుకుంది. ఎన్నో ఏళ్లుగా సీఎంగా సేవలందించిన నితీష్ కుమార్, ఇప్పుడు తన ముఖ చిత్రాన్ని మార్చుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొత్త బాధ్యతలు చేపట్టేందుకు గురువారం ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు ఆయన రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. READ ALSO: Nursing Jobs : తెలంగాణ ఆరోగ్య శాఖలో కొలువుల జాతర.. వారసుడిపై ఢిల్లీ నుంచే క్లారిటీ ఢిల్లీ…
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా పెద్దల సభకు వెళ్లిపోయారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బరిలోకి దిగి విజయం సాధించారు. నితీష్ కుమార్తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కూడా రాజ్యసభకు వెళ్లారు.
Rajya Sabha Elections: దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు పోటీ లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవమైన వారిలో శరద్ పవార్ (NCP), రాందాస్ అథవాలే, అభిషేక్ మను సింఘ్వి, తంబి దురై, వినోద్ తవ్డే, బాబుల్ సుప్రియో వంటి దిగ్గజ నేతలు ఉన్నారు. అయితే, బీహార్, ఒడిశా, హర్యానా రాష్ట్రాల్లో మాత్రం అభ్యర్థులు బరిలో ఉండటంతో పోలింగ్ అనివార్యమైంది. READ ALSO: UAE: యుఏఈలో 35 మంది అరెస్టుకు ఆదేశం..…
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు నామినేషన్ వేశారు. పాట్నాలోని అసెంబ్లీలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
బీహార్ రాజకీయాలు చాలా వేగంగా మారిపోయాయి. రాజ్యసభ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనూహ్యంగా రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్తో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇంత సడన్గా నిర్ణయం తీసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
రాజ్యసభ ఎన్నికల వేళ బీహార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో బీహార్ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తిరిగాయి.
శివరాత్రి కానుకగా బీహార్ మహిళలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గుడ్న్యూస్ చెప్పారు. మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేశారు. దీంతో నారీమణులంతా ఖుషిఖుషిగా ఉన్నారు.
CM Nitish Kumar: సాధారణంగా సీఎంల కాన్వాయ్ కోసం గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం చూస్తూ ఉంటాం. అయితే, బీహార్ సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం ఏకంగా గంట పాటు పలు రైళ్లు నిలిచిపోయాయి. భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న సీఎం కోసం శనివారం సమస్తిపూర్ రైల్వే స్టేషన్లో వైశాలి ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.