Indian Army On POK: కేంద్రం ఆదేశాలు ఇవ్వడం ఆలస్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will carry out any order given by Centre, says Army commander on taking back PoK: కేంద్ర ఇచ్చే ఏ ఆదేశాలనైనా అమలు చేస్తామని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది మంగళవారం అన్నారు. భారత సైన్యానికి సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేస్తుందని.. ఎటువంటి ఆదేశాలకు ఎప్పుడు ఇచ్చినా.. మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.
Read Also: Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
భారత్, పాకిస్తాన్ ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవాల్సి బాధ్యత సైన్యంపై ఉందని, అయితే ఎప్పుడైనా కాల్పులు జరిగితే..పాకిస్తాన్ కు తగిన సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపే ఉన్నారని.. వారిని అగ్నివీరులుగా తీసుకుని వారి సేవలను పొందుతామని.. తర్వాత కొంత మందిని పారామిలిటరీ, ఇతర పోలీసు బలగాల్లోకి చేర్చుకుంటారని.. మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతారని ఆయన అన్నారు.
గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) భాగాలను తిరిగి తీసుకుంటామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించిన వారాల తర్వాత ద్వివేది ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ సైన్యం పీఓకే ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. పీఓకేలో కాశ్మీరీల బాధను మేము అనుభవిస్తున్నాము.. మేము కాశ్మీర్ అభివృద్ధి ప్రారంభించామని.. మేము గల్గిత్ బాల్టిస్తాన్ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. కాశ్మీరియత్ పేరుతో పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తుందని.. ఉగ్రవాదానికి మతం లేదని..ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారతదేశమే అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!