Indian Army On POK: కేంద్రం ఆదేశాలు ఇవ్వడం ఆలస్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్ స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will carry out any order given by Centre, says Army commander on taking back PoK: కేంద్ర ఇచ్చే ఏ ఆదేశాలనైనా అమలు చేస్తామని ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేయడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఉపేంద్ర ద్వివేది మంగళవారం అన్నారు. భారత సైన్యానికి సంబంధించినంత వరకు భారత ప్రభుత్వం ఇచ్చే ఏ ఉత్తర్వులనైనా అమలు చేస్తుందని.. ఎటువంటి ఆదేశాలకు ఎప్పుడు ఇచ్చినా.. మేము ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటామని ఆయన అన్నారు.
Read Also: Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
భారత్, పాకిస్తాన్ ఇరు దేశాల ప్రయోజనాల దృష్ట్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయకుండా చూసుకోవాల్సి బాధ్యత సైన్యంపై ఉందని, అయితే ఎప్పుడైనా కాల్పులు జరిగితే..పాకిస్తాన్ కు తగిన సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. దేశంలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపే ఉన్నారని.. వారిని అగ్నివీరులుగా తీసుకుని వారి సేవలను పొందుతామని.. తర్వాత కొంత మందిని పారామిలిటరీ, ఇతర పోలీసు బలగాల్లోకి చేర్చుకుంటారని.. మరికొంతమంది స్వయం ఉపాధి పొందుతారని ఆయన అన్నారు.
గతంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) భాగాలను తిరిగి తీసుకుంటామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించిన వారాల తర్వాత ద్వివేది ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పాకిస్తాన్ సైన్యం పీఓకే ప్రజలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. పీఓకేలో కాశ్మీరీల బాధను మేము అనుభవిస్తున్నాము.. మేము కాశ్మీర్ అభివృద్ధి ప్రారంభించామని.. మేము గల్గిత్ బాల్టిస్తాన్ తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఆయన అన్నారు. కాశ్మీరియత్ పేరుతో పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తుందని.. ఉగ్రవాదానికి మతం లేదని..ఉగ్రవాదుల ఏకైక లక్ష్యం భారతదేశమే అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
-
Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!