Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Bacteria Types Claimed 6.8 Lakh Lives In India In 2019: ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల 2019లో 77 లక్షల మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు రెండో అతిపెద్ద కారణం అవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియాతో ముడిపడి ఉందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 77 లక్షల మరణాలు సంభవిస్తే ఇందులో సగం మరణాలకు 33 రకాల బ్యాక్టీరియాలు కారణం అయ్యాయి. ఇందులో కేవలం ఐదు రకాలు బ్యాక్టీరియాలు మాత్రమే సగాని కన్నా ఎక్కవ మరణాలకు కారణం అయ్యాయని తేలింది.
Read Also: Imaran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
Also Read
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
భారతదేశంలో 2019లో ఈ కోలి, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, ఎస్. ఆరియస్, ఏ. బౌమాని రకాలు అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా రకాలు 6,78,846 (దాదాపు 6.8 లక్షలు) మంది మరణాలకు కారణం అయ్యాయి. అత్యధికంగా ఈ కోలి బ్యాక్టీరియా 1,57,082 (1.57 లక్షలు) మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్లే ఎక్కువ మంది చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 8,64,000 మంది మరణిస్తే.. వీటి కన్నా ఎక్కువ మంది ఎస్. ఆరియస్, ఈ కోలీ బ్యాక్టీరియాల వల్ల మరణించారని అధ్యయనం వెల్లడించింది.
2019లో 1.37 కోట్ల వివిధ వ్యాధులతో మంది మరణిస్తే, ఇందులో 77 లక్షల మంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో మరణించారు. 77 లక్షల మంది మరణాల్లో 75 శాతం మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు, పెరిటోనియల్ మరియు ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్ల వల్లే మరణించినట్లు తేలింది. ఎస్.ఆరియస్, ఈ కోలీ, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, పీ. ఎరుగినోసా బ్యాక్టీరియాల వల్ల 54.2 శాతం మరణాలకు కారణంగా తేలింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఎస్. ఆరియస్ వల్ల 10 లక్షల మరణాలు నమోదు అయ్యాయి. అయితే వయసును బట్టి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల తీరు మారుతోంది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఎస్. ఆరియస్ బ్యాక్టీరియా ఎక్కువ మరణాలకు కారణం అయితే 5-14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్లో సాల్మొనెల్ల ఎంటెరికా సెరోవర్ టైఫీతో ఎక్కువ మంది మరణించినట్లు స్టడీలో తేలింది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: లార్డ్స్లో భారత్తో చివరి వన్డే.. ఇద్దరు ఇంగ్లండ్ ప్లేయర్స్ అవుట్!
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!