Lancet Study: ఈ 5 బ్యాక్టీరియాలు భారతీయుల మరణాలకు కారణం అవుతున్నాయి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
5 Bacteria Types Claimed 6.8 Lakh Lives In India In 2019: ప్రపంచవ్యాప్తంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల 2019లో 77 లక్షల మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనంలో వెల్లడైంది. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మరణాలకు రెండో అతిపెద్ద కారణం అవుతున్నాయని స్టడీలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది మరణాల్లో ఒకటి బ్యాక్టీరియాతో ముడిపడి ఉందని కనుగొంది. ప్రపంచవ్యాప్తంగా 2019లో 77 లక్షల మరణాలు సంభవిస్తే ఇందులో సగం మరణాలకు 33 రకాల బ్యాక్టీరియాలు కారణం అయ్యాయి. ఇందులో కేవలం ఐదు రకాలు బ్యాక్టీరియాలు మాత్రమే సగాని కన్నా ఎక్కవ మరణాలకు కారణం అయ్యాయని తేలింది.
Read Also: Imaran Khan: భారత్ ఇచ్చిన బంగారు పతకాన్ని కూడా ఇమ్రాన్ అమ్మేశాడు.. పాక్ మంత్రి ఆరోపణలు
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
భారతదేశంలో 2019లో ఈ కోలి, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, ఎస్. ఆరియస్, ఏ. బౌమాని రకాలు అత్యంత ప్రమాదకరమైన బ్యాక్టీరియా రకాలు 6,78,846 (దాదాపు 6.8 లక్షలు) మంది మరణాలకు కారణం అయ్యాయి. అత్యధికంగా ఈ కోలి బ్యాక్టీరియా 1,57,082 (1.57 లక్షలు) మందిని పొట్టనపెట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్లే ఎక్కువ మంది చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా 8,64,000 మంది మరణిస్తే.. వీటి కన్నా ఎక్కువ మంది ఎస్. ఆరియస్, ఈ కోలీ బ్యాక్టీరియాల వల్ల మరణించారని అధ్యయనం వెల్లడించింది.
2019లో 1.37 కోట్ల వివిధ వ్యాధులతో మంది మరణిస్తే, ఇందులో 77 లక్షల మంది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో మరణించారు. 77 లక్షల మంది మరణాల్లో 75 శాతం మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్లు, పెరిటోనియల్ మరియు ఇంట్రా అబ్డామినల్ ఇన్ఫెక్షన్ల వల్లే మరణించినట్లు తేలింది. ఎస్.ఆరియస్, ఈ కోలీ, ఎస్ న్యూమోనియా, కే. న్యూమోనియా, పీ. ఎరుగినోసా బ్యాక్టీరియాల వల్ల 54.2 శాతం మరణాలకు కారణంగా తేలింది. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే ఎస్. ఆరియస్ వల్ల 10 లక్షల మరణాలు నమోదు అయ్యాయి. అయితే వయసును బట్టి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల తీరు మారుతోంది. 15 ఏళ్లకు పైబడిన వారిలో ఎస్. ఆరియస్ బ్యాక్టీరియా ఎక్కువ మరణాలకు కారణం అయితే 5-14 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లల్లో సాల్మొనెల్ల ఎంటెరికా సెరోవర్ టైఫీతో ఎక్కువ మంది మరణించినట్లు స్టడీలో తేలింది.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!