Trump: ‘‘సరదాగా మళ్లీ దాడులు చేయవచ్చు’’.. ఖార్గ్ ద్వీపంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
- ఖార్గ్ ద్వీపంపై మరిన్ని దాడులు చేస్తాం..
- ఇరాన్కు బిగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trump: ఇరాన్కు వ్యూహత్మకంగా, ఆర్థికంగా అతి ముఖ్యమైన ‘‘ఖార్గ్ ద్వీపం’’పై అమెరికా దాడులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ దాడులకు తీవ్ర ప్రతీకారం ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఇదిలా ఉంటే, భవిష్యత్తులో మరిన్ని దాడులు చేయవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఖార్గ్ ద్వీపంలోని చమురు ఎగుమతి కేంద్రాలపై మరిన్ని దాడులు చేస్తామని చెప్పారు. హార్ముజ్ జలసంధిని సురక్షితం చేయడానికి యుద్ధ నౌకల్ని పంపాలని మిత్రదేశాలను కోరారు.
అమెరికా దాడులు ఖార్గ్ ద్వీపంలోని చాలా భాగాన్ని “పూర్తిగా నాశనం చేశాయి” అని ట్రంప్ అన్నారు మరియు మరిన్ని దాడులు జరగవచ్చని, “మేము సరదా కోసం మరికొన్ని సార్లు దానిపై దాడి చేయవచ్చు” అని ప్రకటించారు. యుద్ధం ముగించడానికి ఇరాన్ ఒప్పందానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పినప్పటికీ, నిబంధనలు ఇంకా సరిపోవు అని ఆయన అన్నారు. ఖార్గ్ ద్వీపంపై దాడి మధ్యప్రాచ్యంలో మరింత ఉద్రిక్తతల్ని పెంచాయి. ఈ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు ప్రారంభించడానికి మిడిల్ ఈస్ట్లోని మిత్రదేవాలు చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
Also Read
- Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
- Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
- Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
- Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ఖార్గ్ ద్వీపం ప్రత్యేకత:
ఇరాన్ మొత్తం చమురు ఎగుమతుల్లో 90 శాతం ఈ ద్వీపం నుంచే జరుగుతాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే హార్ముజ్ జలసంధికి దగ్గరలో ఈ ద్వీపం ఉంటుంది. ఇక్కడ దాడులు జరిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఖార్గ్పై దాడులతో ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అమెరికాకు సహకరిస్తున్న యూఏఈలోని ఓడరేవులపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖార్గ్ దీవి ఇరాన్ దక్షిణ తీరానికి సుమారుగా 30 కి.మీ దూరంలో ఉంది.
అయితే, ఖార్గ్ ద్వీపం అమెరికా దాడులు చేసింది. ఈ దాడుల్లో ప్రధానంగా సైనిక మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసింది. ఆయిల్ నిల్వలు, ఎక్స్పోర్ట్ టెర్మినల్స్పై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేయలేదు. ఈ దాడి ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని తగ్గించామని అమెరికా చెబుతోంది.
తాజావార్తలు
-
Terrorist Digital Plan: భారత్ టార్గెట్గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
-
Red Necked Nightjar : చందమామతో టైమ్ సెట్ చేసుకునే పక్షి.. ఇదే ప్రకృతి మ్యాజిక్.!
-
Modi Cabinet: త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ.. ఈ రాష్ట్ర నేతలకు ఛాన్స్!
-
Bangladesh: బెంగాల్లో ముస్లింకు ఏమైనా జరిగితే, బంగ్లాదేశ్లో హిందువుల్ని వదిలిపెట్టం..
-
Watermelon: పుచ్చకాయ తిన్న గంటల్లోనే ఒకరు మృతి, నలుగురికి సీరియస్..
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!