Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- రామాలయ విరాళాల కేసులో రేపు SIT తుది నివేదిక. పరిపాలనా లోపాలు, బాధ్యులపై నివేదికలో ప్రస్తావన అవకాశం 50 బ్యాంకు ఖాతాలపై ఐటీ శాఖ దర్యాప్తు మరిన్ని అరెస్టులు, ఆస్తుల స్వాధీనానికి అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple donation theft: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను బుధవారం(జూలై15)న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ విరాళాల చోరీని దర్యాప్తు చేసింది. సిట్కు ఇచ్చిన అదనపు 15 రోజుల గడువు జూలై 15తో ముగియనుంది. దీంతో ఈ నివేదికను యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) సంజయ్ ప్రసాద్కు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దర్యాప్తులో మరిన్ని అంశాలను పూర్తి చేసేందుకు సిట్ మరింత సమయం కోరుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, పత్రాలు, సాక్షులు, నిందితుల వాంగ్మూలాన్ని సిట్ పరిశీలించింది. ఈ నివేదికలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులనే కాకుండా, పరిపాలనా లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలు, బాధ్యులైన అధికారుల్ని గుర్తించే అవకాశం ఉంది. విరాళాల సేకరణ, భద్రపరిచే విధానం, నగదు లెక్కింపు, బ్యాంకులో జమ, ఆడిట్, పర్యవేక్ష వ్యవస్థల్లో సంస్కరణలను సూచించే అవకాశం ఉంది.
Also Read
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
- PM Modi: పుతిన్ను ఒప్పించి, అణు యుద్ధాన్ని అడ్డుకుంది మోడీనే: పోలాండ్ మంత్రి.
ఇదిలా ఉంటే ఈ కేసులో అక్రమంగా మళ్లించిన నిధుల ఆనవాళ్లు గుర్తించేందుకు అయోధ్య పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్మెంట్ సహాయం కోరారు. ఇప్పటివరకు అరెస్టయిన 8 మంది నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 50 బ్యాంక్ ఖాతా లావాదేవీలను 2022 నుంచి పరిశీలిస్తారు. దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధుల్ని బంధువుల ఖాతాల ద్వారా బదిలీ చేశారా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడుటు పెట్టారా? స్థిరాస్తులు కొనుగోలు చేశారా? ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉంటే వారి అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
-
YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!