Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- రామాలయ విరాళాల కేసులో రేపు SIT తుది నివేదిక. పరిపాలనా లోపాలు, బాధ్యులపై నివేదికలో ప్రస్తావన అవకాశం 50 బ్యాంకు ఖాతాలపై ఐటీ శాఖ దర్యాప్తు మరిన్ని అరెస్టులు, ఆస్తుల స్వాధీనానికి అవకాశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Temple donation theft: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన నివేదికను బుధవారం(జూలై15)న రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ముగ్గురు సభ్యులతో కూడిన సిట్ విరాళాల చోరీని దర్యాప్తు చేసింది. సిట్కు ఇచ్చిన అదనపు 15 రోజుల గడువు జూలై 15తో ముగియనుంది. దీంతో ఈ నివేదికను యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి(హోం) సంజయ్ ప్రసాద్కు సమర్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, దర్యాప్తులో మరిన్ని అంశాలను పూర్తి చేసేందుకు సిట్ మరింత సమయం కోరుతుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
ఈ దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు, సీసీటీవీ ఫుటేజ్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, పత్రాలు, సాక్షులు, నిందితుల వాంగ్మూలాన్ని సిట్ పరిశీలించింది. ఈ నివేదికలో దోపిడీకి పాల్పడిన వ్యక్తులనే కాకుండా, పరిపాలనా లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలు, బాధ్యులైన అధికారుల్ని గుర్తించే అవకాశం ఉంది. విరాళాల సేకరణ, భద్రపరిచే విధానం, నగదు లెక్కింపు, బ్యాంకులో జమ, ఆడిట్, పర్యవేక్ష వ్యవస్థల్లో సంస్కరణలను సూచించే అవకాశం ఉంది.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ఇదిలా ఉంటే ఈ కేసులో అక్రమంగా మళ్లించిన నిధుల ఆనవాళ్లు గుర్తించేందుకు అయోధ్య పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్(ఐటీ) డిపార్ట్మెంట్ సహాయం కోరారు. ఇప్పటివరకు అరెస్టయిన 8 మంది నిందితులు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన దాదాపు 50 బ్యాంక్ ఖాతా లావాదేవీలను 2022 నుంచి పరిశీలిస్తారు. దోచుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిధుల్ని బంధువుల ఖాతాల ద్వారా బదిలీ చేశారా? స్టాక్ మార్కెట్లో పెట్టుబడుటు పెట్టారా? స్థిరాస్తులు కొనుగోలు చేశారా? ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడి పెట్టారా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉంటే వారి అరెస్టులు, ఆస్తుల స్వాధీనం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!