Manipur Violence Cases: అస్సాంలో మణిపూర్ కేసుల విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur Violence Cases: మణిపూర్లోని హింసాకాండకు సంబంధించిన కేసులను అస్సాంలో విచారణ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం జారీ చేసింది. మణిపూర్ హింసాకాండకు సంబంధించిన కేసుల విచారణను పక్క రాష్ట్రాల్లో చేపట్టాలని సూచించిన సుప్రీంకోర్టు.. సీబీఐ విచారణను అస్సాంలో చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. విచారణకు సంబంధించి అవసరమైన న్యాయాధికారుల(జడ్డి)ను నియమించాలని గౌహతి హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా లైంగిక హింసకు పాల్పడిన కేసులతో పాటు మొత్తం 17 కేసులను సీబీఐ విచారించనుంది. అన్ని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేర విచారణ, న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చూసేందుకు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ పార్డివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా కూడా అందులో సభ్యులుగా ఉన్నారు. ఈ కేసులని అస్సాంకు బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు లాయర్లు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
Read Also: Gandeevadhari Arjuna : డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ సంస్థ..?
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
ఇంటర్నెట్ కనెక్టివిటీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని.. అస్సాంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా ఎక్కువగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించింది. కుకీ, మైతీ రెండు తెగల వారూ ఎంతో నష్టపోయారు. కొండల్లో, లోయల్లో, అంతటా బాధితులు ఉన్నారు. అందుకే ఇరు వర్గాలకూ న్యాయంగా ఉండేలా తర్వాత అదేశాలిస్తామని పేర్కొంది. బాధితులు, సాక్షులను కోర్టుకు పిలవకుండా వీడియో కాన్ఫరెన్స్తోపాటు ఇతర మార్గాల్లో వర్చువల్గా విచారించాలని ధర్మాసనం పేర్కొంది. ఫస్ట్ క్లాస్ లేదా గౌహతి, అస్సాం సెషన్స్ కోర్టులో పని చేస్తున్న ఒకరు, లేదా ఇద్దరు జ్యుడీషియల్ మేజీస్ర్టేట్లను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నామినేట్ చేయాలని, మణిపూర్లో మాట్లాడే ఒకటి రెండు భాషలు తెలిసిన వారైతే మంచిదని సూచించింది. నిందితుల హాజరు, రిమాండ్, కస్టడీ, దాని పొడిగింపు వంటి విచారణ ప్రక్రియలన్నీ ఆన్లైన్లో జరిపేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. దూరం, భద్రత తదితర కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మాసనం పేర్కొంది. ప్రయాణ సమస్య కారణంగా నిందితులకు మణిపూర్ లోనే జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి, స్టేట్మెంట్ నమోదు తదితరాల కోసం మణిపూర్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఒకరు, లేదా ఇద్దరు మేజిస్ట్రేట్లను నియమించాలి. దోషుల గుర్తింపు పరేడ్లు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపేందుకు అనుమతించింది. అలాగే సోదాలు, అరెస్ట్ వారెంట్లను కూడా ఆన్లైన్లోనే జారీ చేయొచ్చని సూచించింది. జస్టిస్ గీత మిట్టల్ సారథ్యంలోని ముగ్గురు మహిళా న్యాయమూర్తుల ప్యానల్ సజావుగా పని చేసేందుకు అనువైన ఆదేశాలను సెప్టెంబర్ 1న జారీ చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!