Walayar case: కూతుళ్లపై రేప్కి పేరెంట్స్ సహాయం.. ‘‘వలయార్ కేసు’’ భయపెట్టే నిజాలు..
- 2017 వయలార్ కేసులో సంచలన విషయాలు..
- కూతుళ్లపై అత్యాచారానికి సహకరించిన పేరెంట్స్..
- ఛార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
Walayar case: 2017లో కేరళలో సంచలనంగా మారిన ‘‘వలయార్ కేసు’’లో సంచలన విషయాలు సీబీఐ విచారణలో వెలుగులోకి వచ్చాయి. సొంత తల్లి కూతుళ్లపై అత్యాచారం చేసేందుకు సహకరించిందని, నిందితుల్లో ఒకరితో ఆమెకు సంబంధం ఉందని, తల్లిదండ్రులే వారి పిల్లలపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. తల్లి తన పిల్లల సమక్షంలోనే ప్రధాన నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.
లైంగిక వేధింపులను తాళలేక, తల్లిదండ్రుల నుంచి సహకారం లేకపోవడంతో 13, 09 ఏళ్ల ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదటి నిందితుడు వాలియ మధు బాలికలపై లైంగిక దాడికి పాల్పడినట్లు, ఇందుకు తల్లిదండ్రులు సహకరించినట్లు అభియోగం మోపింది. బాలికల తల్లిదండ్రులపై లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద సహా పలు ఆరోపణల కింద విచారణ ఎదుర్కొన్నారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
Read Also: Farmers Protest: సాగునీటిని అందించాలంటూ రైతుల ఆందోళన
కేసు వివరాలు:
2017లో జనవరి 13న 13 ఏళ్ల బాలిక వలయార్లోన అట్టప్పలంలోని తన గదిలో ఇంట్లో ఉరి వేసుకుని మరణించింది. దాదాపు రెండు నెలల తర్వాత మార్చి 4, 2017లో ఆమె చెల్లెలు కూడా ఇదే విధంగా మరణించింది. ముందుగా వీటిని ఆత్మహత్యలని భావించినప్పటికీ, స్థానికంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పోస్టుమార్టం నివేదికల్లో లైంగిక దాడి జరిగిందని నిర్ధారించాయి, అయితే, ఆధారాలు లేకపోవడంతో కేసుని కొట్టేశారు.
ఈ కేసుపై సిట్ ఏర్పడింది. జూన్ 2019లో లైంగిక వేధింపులే ఇద్దరి మరణాలకు దారి తీశాయని పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, పాలక్కాడ్ పోక్సో కోర్టు నిందితులు వాలియ మధు, ఎం మధు, శిబు, ప్రదీప్ కుమార్లపై సాక్ష్యాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసింది. ఇది కేరళ వ్యాప్తంగా భారీ నిరసనలు కారణమైంది. దీంతో కేరళ హైకోర్టు 2021లో సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ మొదటి ఛార్జిషీట్, 2021లో పోలీసులు ఛార్జిషీట్ మధ్య సారుప్యతలు ఉండటంతో పాలక్కాడ్ పోక్సో కోర్టు తిరస్కరించింది. ఆగస్టు 2024లో కేరళ హైకోర్టు ఈ కేసుని ఎర్నాకుళం సీబీఐ కోర్టుకు బదిలీ చేసింది, పునర్విచారణ అవసరమని పేర్కొంది.
Read Also: Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..
సీబీఐ ఛార్జిషీట్లో సంచలన విషయాలు..
తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలికలపై వారి సొంత తల్లిదండ్రులే లైంగిక దాడికి అనుమతించారనే విషయం తెలిసింది. ఏళ్ల తరబడి లైంగిక దోపిడీని భరించారని పేర్కొంది. తల్లి మొదటి నిందితుడితో లైంగిక సంబంధం పెట్టుకుందని, తన పెద్ద కుమార్తెపై రేప్ జరిగిందని తెలిసినా, తన చిన్న కుమార్తెపై అత్యాచారానికి సహకరించినట్లు ఛార్జిషీట్ వెల్లడించింది.
తల్లిదండ్రులు తన పిల్లల్ని రక్షించాల్సింది పోయి, నిందితుడు మద్యం తాగిన తర్వాత వేధింపులకు పాల్పడేందుకు సహకరించినట్లు తల్లి సహకరించిందని తేలింది. 2016 ఏప్రిల్లో మొదటి నిందితులు పెద్ద కుమార్తెపై అత్యాచారం చేయడాన్ని చూసిందని, రెండు వారాల తర్వాత తండ్రి కూడా వేధింపులు జరుగుతున్నట్లు చూశాడని, అయినప్పటికీ ఎవరూ పోలీసులకు చెప్పకుండా, నేరస్తులతో సంబంధాన్ని కొనసాగించారు.
అక్క మరణించిన తర్వాత, చిన్న కూతురిని మొదటి నిందితుడి ఇంటికి పంపారు. ఉద్దేశపూర్వకంగా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీబీఐ తేల్చింది. తన అక్క ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలిసిన చిన్న అమ్మాయి తీవ్ర మనోవేధనకు గురైనట్లు సీబీఐ పేర్కొంది.
Read Also: Ranveer Allahbadia: “తల్లిదండ్రుల సె**క్స్” కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్
హత్య..? ఆత్మహత్యా..?
అయితే, బాలికలు హత్యకు గురయ్యారా..? ఆత్మహత్య చేసుకున్నా..? అనే దానిపై సీబీఐ హత్యను తోసిపుచ్చింది. ఆత్మహత్య కావచ్చని అభిప్రాయపడింది. పోస్ట్మార్ట ఫలితాలు ఉరితో సరిపోతున్నట్లు పోలీస్ సర్జన్ నివేదిక నిర్ధారించింది. తీవ్రమైన వేధింపులు, తల్లిదండ్రుల మద్దతు లేకపోవడంతో బాలికలు ప్రాణాలు తీసుకుని ఉండొచ్చని మానసిక పరీక్షల్లో సూచించబడింది.
గతంలో ప్రజాపోరాటాలకు నేతృత్వం వహించిన తల్లి సీబీఐ విచారణను ద్రోహంగా అభివర్ణించింది. సీబీఐపై నమ్మకాన్ని కోల్పో్యామని చెప్పింది. తాను, తన భర్త తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు పాలిగ్రాఫ్ టెస్టుకు సిద్ధమని చెప్పింది. తల్లిదండ్రుల ప్రమేయం ఉందానా అనేది కోర్టు నిర్ధారించాల్సి ఉంది. ఒక వేళ ఆరోపణలు నిజమని తెలిస్తే దోషులకు జీవిత ఖైదుతో పాటు కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Onam Release : ఓనమ్ స్పెషల్.. ముగ్గురు మలయాళ బిగ్ స్టార్స్ మధ్య బిగ్ ఫైట్
-
Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
-
B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
-
PEDDI : పాన్ ఇండియా స్థాయిలో పెద్ది ‘పెయిడ్ ప్రీమియర్స్’ ప్లానింగ్
-
Vishwambhara : ‘పెద్ది’ అడ్డంకి తొలగింది.. విశ్వంభర రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!