Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..
- షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేసిన యూనస్ సర్కార్..
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా ‘‘ఆపరేషన్ డెవిల్ హంట్’’..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేత మహ్మద్ యూనస్ తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారుల్ని దేశవ్యాప్తంగా వేటాడేందుకు ‘‘ఆపరేషన్ డెవిల్ హంట్’’ని ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా అస్థిరత, ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో షేక్ హసీనా అవామీలీగ్ పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిస్తుందనే భయంతో వారిని అణిచివేసే ప్రయత్నంలో యూనస్ ఉన్నారు.
బంగ్లాదేశ్ భద్రతా దళాలు దేశవ్యాప్తంగా 1308 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశాయి. గత వారం గాజీపూర్ లో మాజీ అవామీ లీగ్ మంత్రి ఇంటిపై దాడి చేసిన సందర్భంలో విద్యార్థి కార్యకర్తలపై ప్రతిదాడి జరిగింది. ఆ తర్వాత శనివారం నుంచి ఈ ఆపరేషన్ని ప్రారంభించేందుకు మహ్మద్ యూనస్ ఆదేశాలు జారీ చేశారు. సైన్యం, పోలీసులు, ప్రత్యేక విభాగాలు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. మెట్రోపాలిటన్ ప్రాంతాల నుంచి కనీసం 274 మందిని, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి మరో 1034 మందిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ మీడియా పేర్కొంది.
Also Read
ఈ ఆపరేషన్ కింద అరెస్ట్ చేయబడిన వ్యక్తుల్లో ఎక్కువ మంది అవామీలీగ్, దాని అనుబంధ సంస్థలకు చెందిన కార్యకర్తలే ఉన్నారు. గాజీఫూర్లో అవామీ లీగ్కి చెందిన 81 మంది నాయకుల్ని, కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. కమిల్లాలో షేక్ హసీనా పార్టీకి చెందిన మరో ముగ్గుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నోఖాలిలో ని హతియా సబ్ డిస్ట్రిక్ట్లోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన రైడ్స్లో యూనియన్ పరిషత్ చైర్మన్తో పాటు ఏడుగురు అవామీ లీగ్ నాయకుల్ని అరెస్ట్ చేశారు.
Read Also: Viral: ఇండియా-పాక్ మధ్య కొన్ని రోజుల్లో మ్యాచ్.. గొడవ పడ్డ హర్భజన్, అక్తర్.. (వీడియో)
ఈ ఆపరేషన్పై బంగ్లా ఏం చెబుతోంది..?
దేశవ్యాప్తంగా అశాంతిని అరికట్టడం, ప్రజా భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం శనివారం ‘ఆపరేషన్ డెవిల్ హంట్’ అనే ప్రత్యేక డ్రైవ్ను ప్రారంభించింది. షేక్ హసీనా అవాలీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులు విద్యార్థులపై దాడులు తీవ్రం చేసిన తర్వాత ఆ ఆపరేషన్ ప్రారంభమైంది. దీని గురించి ఆ దేశ హోంశాఖ అడ్వైజర్ ఎండీ జహంగీర్ ఆలం చౌదరి మాట్లాడుతూ.. దెయ్యాలను న్యాయం ముందు నిలబెట్టాలి, ఒక్క దెయ్యాన్ని కూడా వదిలపెట్టకూడదని షేక్ హసీనా మద్దతుదారుల గురించి వ్యాఖ్యానించాడు.
ఆదివారం తరువాత, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ కార్యదర్శి నసిముల్ ఘని మాట్లాడుతూ, ఆపరేషన్ అవసరమైనంత కాలం కొనసాగుతుందని అన్నారు. “దేశాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్న ప్రాంతాలను తటస్థీకరించడం మా లక్ష్యం” అని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ కోసం ఢాకలో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!