RSS On Bangladesh: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..
- బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితిపై స్పందించిన ఆర్ఎస్ఎస్..
- అంతర్జాతీయ మద్దతు కూడగట్టాలని కేంద్రానికి పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RSS On Bangladesh: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త మద్దతు కూడగట్టాలని, అందుకోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) పిలుపునిచ్చింది. అన్యాయంగా నిర్బంధించిన హిందూ సన్యాసి, ఇస్కాన్ మాజీ నేత చిన్మోయ్ కృష్ణదాస్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, జరుగుతున్న హింసను ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే ఖండించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా ప్రభుత్వం హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసకు ‘‘నిశ్శబ్ధ ప్రేక్షకుడిగా’’ ఉందని ఆయన ఆరోపించారు.
Read Also: ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు
Also Read
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- HAPIDA SKYNeX Flying Vehicle: ట్రాఫిక్కు చెక్ పెట్టే ‘ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కార్’.. యువకుడి అద్భుత ఆవిష్కరణ! (వీడియో)
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
ఇటీవల ఢాకా నుంచి ఛటోగ్రామ్ వెళ్తున్న చిన్మోయ్ కృష్ణదాస్ని ఢాకా విమానాశ్రయంలో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్లో హిందువులు, మహిళలు, ఇతర మైనారిటీలందరిపై ఇస్లామిక్ ఛాందసవాదులు చేస్తున్న దాడులు, హత్యలు, దోపిడీలు, దహనం, అమానవీయ దౌర్జన్యాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిని ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను కొనసాగించాలని హోసబాలే నొక్కి చెప్పారు. హిందువుల్ని రక్షించడానికి దౌత్యపరమైన చర్యల్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత అక్కడి రాడికల్ ఇస్లామిక్ గ్రూపులు మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తున్నాయి. హిందువుల ఆస్తులు, ఆలయాలు, వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు. హిందూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలను రక్షించాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరింది.
తాజావార్తలు
-
Rishabh Pant: అర్ధరాత్రి సీఎం సాయం కోరిన రిషబ్ పంత్.. స్పందించిన పుష్కర్ సింగ్ ధామి
-
Bharat Bhhagya Viddhaata: తుపాకుల మోతలో ప్రాణాలను పణంగా పెట్టిన రియల్ హీరోలు.. ఓటీటీలోకి ‘భారత్ భాగ్య విధాత’
-
Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
-
Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
-
Vegetable Chips: బయట ఫుడ్స్కి గుడ్బై.. ఇంట్లోనే చుక్క నూనె లేకుండా క్రిస్పీ, హెల్తీ వెజిటెబుల్ చిప్స్ రెడీ..
ట్రెండింగ్
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!