Mohan Bhagwat: భాషా వివాదాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భాష, కులం, సంపద వంటి భేదాలను పక్కనపెట్టి సామాజక సామరస్యతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ వ్యక్తి తన ఇంట్లో తప్పనిసరిగా మాతృభాష మాట్లాడాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు ఆ ప్రాంతాల భాషను నేర్చుకోవాలని అన్నారు. భారత్ లోని అన్ని భాషలకు సమాన గౌరవం ఉందని ఆయన అన్నారు.
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
యువతకు, పిల్లలకు స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ కంటే హనుమంతుడు చాలా బలవంతుడు.. ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడు.. కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు అన్నారు.
Navneet Rana: దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది పిల్లలు ఉన్నారని, వారి జనాభా పెరుగుతూనే ఉందని, దానిని ఎదుర్కొవడానికి, హిందుస్థాన్ను రక్షించడానికి హిందువులు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలని ఆమె పిలుపునిచ్చారు.
Mohan Bhagwat: పోలికల ద్వారా, రాజకీయ కోణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను అర్థం చేసుకోవడం తరుచుగా అపార్థాలకు దారి తీస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం అన్నారు. కోల్కతాలో జరిగిన ‘‘ఆర్ఎస్ఎస్ 100 వ్యాఖ్యాన మాల’’ కార్యక్రమంలో ఆయన పఈ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ ను కేవలం మరో సేవా సంస్థగా చూడటం సరికాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ను కేవలం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)తో ముడిపెట్టవదని ఆయన చెప్పారు. చాలా మంది సంఘ్ను బీజేపీ కోణం…
RSS: తమిళనాడులో తిరుప్పరంకుండ్రంలోని ‘‘సుబ్రమణ్య స్వామి’’ ఆలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొండపై ఉన్న ఆలయ స్తంభం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, డీఎంకే ప్రభుత్వం మాత్రం కొండ కింద ఉన్న దీపం వెలిగించేందుకే అనుమతి ఇచ్చింది. మరోవైపు, కుమారస్వామి భక్తులు మాత్రం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇటీవల ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇదిలా ఉంటే, ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి స్వామినాథన్ను తొలగించాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకేలు కలిసి…
Rahul Gandhi: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒక రోజు తర్వాత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరోక్షంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డారు. నెహ్రూ సెంటర్ ఇండియా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం పాలక పార్టీ(బీజేపీ) ప్రధాన లక్ష్యంగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూపై దుష్ప్రచారం చేయడం, ఆయన కించపరచమే అని ఆరోపించారు. ఒక పద్ధతి ప్రచారం ఆయన వారసత్వాన్ని తుడిచివేసే ప్రయత్నం జరుగోతందని ఆమె అన్నారు. నెహ్రూ నిర్మించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ పునాదులను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు.
D. Raja Warns RSS: విజయవాడలో సీపీఐ రాష్ట్ర జనరల్ బాడీ సమావేశానికి వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మీట్ ది ప్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 19 రాష్ట్రాలలో NDA రావడంపై ఇప్పటికే ఆందోళనలో ఉన్నారని అన్నారు.