Temple-Mosque disputes: మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ పత్రిక..
- మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించి ఆర్ఎస్ఎస్ పత్రిక..
- మందర్-మసీద్ వివాదాలపై ఇటీవల భగవత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే, మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఆర్ఎస్ఎస్ పత్రిక ‘‘ది ఆర్గనైజర్’’ వ్యతిరేకించింది. “నాగరిక న్యాయం” కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తన వైఖరిని తెలియజేసింది. ఆర్గనైజర్ తాజా ఎడిషన్లో ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్ మసీదు వివాదం గురించి కవర్ స్టోరీని అందించింది. షాహీ జామా మసీదు ఒకప్పుడు ఆలయమని ప్రస్తావించింది. చారిత్రాత్మకంగా ఆక్రమించబడిన లేదా కూల్చివేయబడిన మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని వాదించింది.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
Read Also: Anna University Incident: ఉదయనిధి స్టాలిన్తో అత్యాచార నిందితుడు.. ఫోటోలు షేర్ చేసిన బీజేపీ..
‘‘అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి, నాగరిక న్యాయాన్ని సాధించడానికి చరిత్ర మరియు ఇతిహాసపై నిజమైన అవగాహన చాలా అవసరం. నాగరిక న్యాయం కోసం ఈ అన్వేషణను పరిష్కరించే సమయం ఆసన్నమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరమైన పరిష్కారాలను అందించడం ద్వారా కుల ఆధారిత వివక్ష యొక్క మూలాన్ని పరిష్కరించి, వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నించారు’’ అని ఆర్గనైజర్ తన సంపాదకీయంలో పేర్కొంది. కొంతమంది వలసవాద ఉన్నతవార్తలు, నకిలీ మేధావులు, లౌకిక వాదం యొక్క లోపభూయిష్టతను కొనసాగించాలని కోరుకుంటున్నారని, న్యాయాన్ని, సత్యాన్ని తెలుసుకునే హక్కుని తిరస్కరించడం ద్వారా రాడికలిజం, వేర్పాటువాదం, శత్రుత్వానికి ఆజ్యం పోస్తుందని కథనం పేర్కొంది.
ఇటీవల, పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణాన్ని అనుసరించి కొంతమంది వ్యక్తులు అలాంటి వివాదాలను రేకెత్తించడం ద్వారా తాము “హిందువుల నాయకులు” అవుతారనే భావనలో ఉన్నారని అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!