Temple-Mosque disputes: మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించిన ఆర్ఎస్ఎస్ పత్రిక..
- మోహన్ భగవత్ వ్యాఖ్యలతో విభేదించి ఆర్ఎస్ఎస్ పత్రిక..
- మందర్-మసీద్ వివాదాలపై ఇటీవల భగవత్ కీలక వ్యాఖ్యలు..
Temple-Mosque disputes: మందిర్-మసీద్ వివాదాలపై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో పలు మసీదుల విషయం వివాదాస్పదం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంభాల్ షాహీ జామా మసీదు వివాదం, అజ్మీర్ దర్గా వివాదం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించారని ఆరోపిస్తూ కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, కొత్త దేవాలయాలు-మసీదు వ్యాజ్యాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే, మోహన్ భగవత్ వ్యాఖ్యల్ని ఆర్ఎస్ఎస్ పత్రిక ‘‘ది ఆర్గనైజర్’’ వ్యతిరేకించింది. “నాగరిక న్యాయం” కోసం వివాదాస్పద స్థలాలు, నిర్మాణాల వాస్తవ చరిత్రను తెలుసుకోవడం చాలా ముఖ్యమని తన వైఖరిని తెలియజేసింది. ఆర్గనైజర్ తాజా ఎడిషన్లో ఉత్తర్ ప్రదేశ్లోని సంభాల్ మసీదు వివాదం గురించి కవర్ స్టోరీని అందించింది. షాహీ జామా మసీదు ఒకప్పుడు ఆలయమని ప్రస్తావించింది. చారిత్రాత్మకంగా ఆక్రమించబడిన లేదా కూల్చివేయబడిన మతపరమైన ప్రదేశాలకు సంబంధించిన సత్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకమని వాదించింది.
Also Read
Read Also: Anna University Incident: ఉదయనిధి స్టాలిన్తో అత్యాచార నిందితుడు.. ఫోటోలు షేర్ చేసిన బీజేపీ..
‘‘అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి, నాగరిక న్యాయాన్ని సాధించడానికి చరిత్ర మరియు ఇతిహాసపై నిజమైన అవగాహన చాలా అవసరం. నాగరిక న్యాయం కోసం ఈ అన్వేషణను పరిష్కరించే సమయం ఆసన్నమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగపరమైన పరిష్కారాలను అందించడం ద్వారా కుల ఆధారిత వివక్ష యొక్క మూలాన్ని పరిష్కరించి, వాటిని నిర్మూలించేందుకు ప్రయత్నించారు’’ అని ఆర్గనైజర్ తన సంపాదకీయంలో పేర్కొంది. కొంతమంది వలసవాద ఉన్నతవార్తలు, నకిలీ మేధావులు, లౌకిక వాదం యొక్క లోపభూయిష్టతను కొనసాగించాలని కోరుకుంటున్నారని, న్యాయాన్ని, సత్యాన్ని తెలుసుకునే హక్కుని తిరస్కరించడం ద్వారా రాడికలిజం, వేర్పాటువాదం, శత్రుత్వానికి ఆజ్యం పోస్తుందని కథనం పేర్కొంది.
ఇటీవల, పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ, రామ మందిర నిర్మాణాన్ని అనుసరించి కొంతమంది వ్యక్తులు అలాంటి వివాదాలను రేకెత్తించడం ద్వారా తాము “హిందువుల నాయకులు” అవుతారనే భావనలో ఉన్నారని అన్నారు.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీ వారణాసి పర్యటన.. కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు
-
AP SSC Results 2026: రేపే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు..
-
OnePlus Ace 6 Ultra: వన్ప్లస్ ఏస్ 6 అల్ట్రా విడుదల.. 8600mAh బ్యాటరీ, Dimensity 9500తో గేమింగ్ మాన్స్టర్
-
Preity Zinta: మ్యాచ్ ఓడినా.. అభిమానుల మనసు గెలిచిన పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా!
-
Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో