Fake Gold : తక్కువ ధరకే బంగారం కోటి లూటీ..
- సగం రేటుకే బంగారం అంటూ కోటి రూపాయల మోసం
- నకిలీ పోలీసుల ప్లాన్తో వ్యాపారిని లూటీ చేసిన ముఠా
- కీ సూత్రధారి కానిస్టేబుల్ పరారీలో, ఐదుగురు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సగం రేటుకే బంగారం వస్తుందంటే నమ్మేశాడు. ఏకంగా కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. రిటైల్గా బంగారం అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటే అసలుకే మోసం వచ్చింది. ఓ ముఠా స్మార్ట్గా చీట్ చేయడంతో.. ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. కోటి రూపాయల బంగారం ఆర్డర్ ఇచ్చిన వ్యాపారి. సికింద్రాబాద్ పరిధిలోని ఆర్కే జ్యువెలరీ యజమానిని కొంత మంది ముఠా సంప్రదించింది. అతని వద్దకు నకిలీ పోలీసుల రూపంలో వెళ్లారు ఆరుగురు ముఠా సభ్యులు. వచ్చింది నిజం పోలీసులేనని జ్యువెలరీ వ్యాపారి నమ్మిన తర్వాత మార్కెట్ ధర కంటే తక్కువకే బంగారం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. జ్యువెలరీ వ్యాపారికి డీల్ నచ్చడంతో కోటి రూపాయల బంగారం కావాలని ఆర్డర్ ఇచ్చాడు. ఐతే కాస్త అనుమానంతో నగలు చూపించాలని కోరాడు. వారు బంగారం చూపించడంతో అంతా నిజమేనని నిర్ధారించుకున్నాడు..
Israel-Iran War: ఇరాన్పై దాడి.. రెండు వారాల్లో నిర్ణయం..
Also Read
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
- Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Modi-CM Vijay: ప్రధాని మోడీకి సీఎం విజయ్ లేఖ.. దేనికోసమంటే..!
ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య కోటి రూపాయల డీల్ కుదిరింది. ఐతే డీల్లో భాగంగా తమకు కోటి నగదు చూపించాలని ముఠా సభ్యులు కోరడంతో షాపు యజమాని నగదు తెచ్చేందుకు సెకండ్ బజార్లో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాడు. నగదు తీసుకొస్తుండగా దారిలో ముగ్గురు వ్యక్తులు SOT పోలీసుల పేరుతో ఎంట్రీ ఇచ్చారు. వ్యాపారిని బెదిరించి డబ్బు సీజ్ చేస్తున్నామని చెప్పి కారులో పరారయ్యారు.. ముఠా చేతిలో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జూబ్లీ బస్ స్టాప్ వద్ద ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో కీలక సూత్రధారిగా ఉన్న 8వ బెటాలియన్ కు చెందిన కేశవ్ అనే కానిస్టేబుల్ కొట్టేసిన డబ్బుతో పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు…
Karishma Kapoor : సంజయ్ కపూర్ అంత్యక్రియల్లో ఏడ్చేసిన కరిష్మాకపూర్..
తాజావార్తలు
-
Bajirao Peshwa : గెరిల్లా వార్లో దిట్ట.. బాజీరావు స్టైల్ ఇదే.!
-
Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
-
Uttam Kumar Reddy: రాష్ట్ర వ్యాప్తంగా 8,575 కొనుగోలు కేంద్రాలు.. ధాన్యం కొనుగోళ్లపై మంత్రి కీలక వ్యాఖ్యలు..
-
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
-
PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!