Mumbai: బర్త్ డే పార్టీకని పిలిచి… మైనర్ పై ఆరుగురి పైశాచికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Physical assault on girl: దేశంలో అత్యాచారాలు అడ్డుకట్ట పటడం లేదు. రోజుకు ఎక్కడో ఓ మూల అత్యాచార ఘటన వెలుగులోకి వస్తూనే ఉంది. చాలా సంఘటనల్లో తెలిసిన వారే బాలికలు, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల అగడాలు తగ్గడం లేదు. ఇదిలా ఉంటే ముంబైలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడని నమ్మినందుకు బాలికపై దారుణానికి ఒడిగట్టారు.
Read Also: China: 20 రోజుల్లోనే 25 కోట్ల మందికి కోవిడ్.. లీకైన డాక్యుమెంట్లో వెల్లడి
Also Read
నమ్మి వెళ్లినందుకు ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటన ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో జరిగింది. 16 ఏళ్ల బాలికపై ఆరుగురు కామాంధులు అఘాయిత్యానిక తెగబడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అత్యాచారం చేసిన వారిలో బాలిక స్నేహితుడు కూడా ఉన్నాడు. స్నేహితుడి పుట్టిన రోజు ఉందని బాలిక ఫ్రెండ్ చెప్పడంతో ఇద్దరు కలిసి వెళ్లారు. మరో ఐదుగురు నిందితులు అక్కడే ఉన్నారు. అయితే మొత్తం ఆరుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే ఆ ప్రాంతంలోని నివాసితులు బాలిక కేకలు విని స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ నిందితుల్లో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు. ఎన్ఎం జోషి మార్గ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటనపై కేసు నమోదు అయింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా నిందితులపై అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకుని డోంగ్రీలోని జువైనల్ హోమ్ కు పంపారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
-
CM NTR: సీఎం ఎన్టీఆర్.. దద్దరిల్లిన థియేటర్
-
Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!