Minister Malla Reddy: నాయకులకు “చాయ్” ఇస్తున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallareddy giving tea to brs leaders: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి రానుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు కేసీఆర్ స్వశక్తి కోసం అడుగులు వేస్తున్నారు. రెండు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ బీఆర్ఎస్ కార్యాలయ పనులను పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
- Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
- Gen-z Viral Video: మేము "జెన్-జీ" ఏమైనా చేస్తాం అంటే బాగుండదు.. లడఖ్ వైరల్ వీడియోపై సీఎం సెటైర్లు..
అయితే ఢిల్లీలో అతిథులకు చాయ్ ఇస్తున్న మంత్రి మల్లా రెడ్డి వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, నాయకులకు చాయ్ కప్పులు పట్టుకుని ఉంటే వారికి తన దగ్గర వున్న మగ్గులో నిండా చాయ్ వుంది. దానిని పార్టీ నాయకులకు కప్పులో వేస్తుండటం. వారు ఆనందంగా తీసుకుని చాయ్ తాగడం ఆశక్తి నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఇలా చాయ్ వాలాగా మారడంతో చర్చనీయాంశంగా మారింది. కొందరు చాయ్ వాలాగా మారిన మంత్రి మల్లారెడ్డి అంటూ విమర్శిస్తుంటే.. మరికొందరు అందరూ ఉన్నచోటు పదవులతో సంబంధం లేకుండా అంతా సమానంగా ఆనందంగా మెలగడం అంటే ఇదేనేమో అంటూ ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ భవనంలో ఈసీన్ తెరపైకి రావడంతో పలువురు హర్షం చేస్తున్నారు.
ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది. నేడు జపాన్ వ్యాపార ప్రపంచ ప్రముఖులతో భేటీ కానున్న కేటీఆర్.. జపాన్ కంపెనీ బాష్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వారు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్కు కేటీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ అనుమతితోనే బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!