Minister Malla Reddy: నాయకులకు “చాయ్” ఇస్తున్న మల్లారెడ్డి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallareddy giving tea to brs leaders: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లోకి రానుంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నేడు కేసీఆర్ స్వశక్తి కోసం అడుగులు వేస్తున్నారు. రెండు రోజులుగా బీఆర్ఎస్ కార్యాలయంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్న కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 12.45 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు పలువురు మంత్రులు, నేతలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఢిల్లీలోనే ఉంటూ బీఆర్ఎస్ కార్యాలయ పనులను పర్యవేక్షిస్తున్నారు.
Also Read
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
అయితే ఢిల్లీలో అతిథులకు చాయ్ ఇస్తున్న మంత్రి మల్లా రెడ్డి వీడియో వైరల్ అవుతుంది. ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చిన నాయకులకు మంత్రి మల్లారెడ్డి పలకరించి, నాయకులకు చాయ్ కప్పులు పట్టుకుని ఉంటే వారికి తన దగ్గర వున్న మగ్గులో నిండా చాయ్ వుంది. దానిని పార్టీ నాయకులకు కప్పులో వేస్తుండటం. వారు ఆనందంగా తీసుకుని చాయ్ తాగడం ఆశక్తి నెలకొంది. మంత్రి మల్లారెడ్డి ఇలా చాయ్ వాలాగా మారడంతో చర్చనీయాంశంగా మారింది. కొందరు చాయ్ వాలాగా మారిన మంత్రి మల్లారెడ్డి అంటూ విమర్శిస్తుంటే.. మరికొందరు అందరూ ఉన్నచోటు పదవులతో సంబంధం లేకుండా అంతా సమానంగా ఆనందంగా మెలగడం అంటే ఇదేనేమో అంటూ ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. బీఆర్ఎస్ భవనంలో ఈసీన్ తెరపైకి రావడంతో పలువురు హర్షం చేస్తున్నారు.
ఇవాళ జరగనున్న బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది. నేడు జపాన్ వ్యాపార ప్రపంచ ప్రముఖులతో భేటీ కానున్న కేటీఆర్.. జపాన్ కంపెనీ బాష్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వారు గైర్హాజరైనట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్కు కేటీఆర్ సమాచారం అందించారు. కేసీఆర్ అనుమతితోనే బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి కేటీఆర్ హాజరుకావడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
-
Shreyas Iyer: సంజూ శామ్సన్ను పక్కన పెట్టడానికి కారణం ఇదే.. కెప్టెన్ శ్రేయస్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thalapathy Vijay: కొడుకు కెరీర్ను దళపతి విజయ్ తొక్కేస్తున్నారా? అసలు స్కెచ్ ఇదేనా!
-
Nagabandham: ‘నాగబంధం’ మేకర్స్ ఊహించని నిర్ణయం!
-
Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..