Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలోకి థానే కార్పొరేటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో రాజకీయ చదరంగం ఇంకా ముగిసిపోలేదు. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతూనే ఉన్నాయి. ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఏక్ నాథ్ షిండే సీఎంగా పదవిని చేపట్టాడు. బీజేపీ, శివసేన రెబెల్ నేతలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తాకింది. థానే మున్సిపల్ కార్పొరేషన్ లోని 67 మంది కార్పొరేటర్లలో 66 మంది ఏక్ నాథ్ షిండే వర్గానికి మద్దతు పలికారు.
థానే మున్సిపల్ కార్పొరేషన్ శివసేనకు కంచుకోట లాంటిది. ముంబై తరువాత థానే మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత కీలకమైనది. 131 మంది సభ్యుల థానే మున్సిపల్ కార్పొరేషన్ పదవీకాలం కొన్ని రోజుల క్రితం ముగిసింది. త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మేయర్ నరేష్ మాస్కే, సీఎం ఏక్ నాథ్ షిండేను నందనవన్ బంగ్లాలో కలిసి తన మద్దతు తెలియజేశాడు.
Also Read
- 2026 Half Year: అర్థ సంవత్సరంలో జాతీయంగా జరిగిన విశేషాలు ఇవే!
- UP: రాయ్బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Vikarabad: వీఆర్వో పాడుబుద్ధి.. భార్యకు పిల్లలు పుట్టడం లేదని..
గత నెలలలో ఏక్ నాథ్ షిండే, అప్పటి సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి 39 మంది శివసేన ఎమ్మెల్యేలతో గౌహతిలో క్యాంప్ ఏర్పాటు చేశాడు. ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి రెబెల్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీఏ ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో బీజేపీ సహాయంతో షిండే ముఖ్యమంత్రి అయ్యారు. బలనిరూపణ సమయంలో మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు. ప్రస్తుతం శివసేన 18 మంది ఎంపీల్లో 12 మంది షిండే వర్గంలో చేరుతారని సమాచారం
తాజావార్తలు
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!