Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
- బిడ్డను తల్లికి దూరంగా ఉంచడం ‘‘క్రూరత్వమే’’..
- అత్తమామలపై కేసు కొట్టేయడం సాధ్యం కాదు..
- బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
‘‘నాలుగేళ్ల చిన్నారి తల్లికి దూరంగా ఉంచడం కూడా మానసిక వేధింపులతో సమానం. అది తల్లి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఇది కూరత్వానికి సమానం’’ అని పేర్కొంది. అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వమే అని చెప్పింది. మానసిక వేధింపులు రోజు రోజుకు కొనసాగుతున్నాయని ఇది తప్పు అని ధర్మాసనం పేర్కొంది. అత్తమామలపై ఎఫ్ఐఆర్ని రద్దు చేయలేమని చెప్పింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
Read Also: Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
మహారాష్ట్ర జల్నా జిల్లాలో మహిళ తన అత్తామామలు, ఆడపడుచుపై వేధింపుల కేసు పెట్టింది. 2022లో నమోదైన ఈ కేసుని రద్దు చేయాలని వారు కోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2019లో వివాహం జరిగింది. 2020లో ఒక కుమార్తె జన్మించింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. మే 2022లో సదరు మహిళ అత్తగారి ఇంటి నుంచి బయటకు నెట్టారు. తన కుమార్తెని తీసుకెళ్లడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది.
దీంతో మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023లో పిల్లల సంరక్షణ తల్లికి అప్పగించాలని కోర్టు భర్తని ఆదేశించింది. అయితే, భర్త, అతడి కుటుంబీకులు ఈ ఉత్తర్వులను పాటించకుండా, బిడ్డను తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డ భర్త వద్ద ఉన్నాడని తెలిసీ కూడా మహిళ అత్తమామలు ఆయనకు రహస్యం సహకరిస్తున్నారని బెంజ్ పేర్కొంది. న్యాయశాఖ ఆదేశాలు గౌరవించని వారు ఉపశమనానికి అర్హులు కాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!