Bombay High Court: బిడ్డని తల్లి నుంచి దూరం చేయడం క్రూరత్వమే..
- బిడ్డను తల్లికి దూరంగా ఉంచడం ‘‘క్రూరత్వమే’’..
- అత్తమామలపై కేసు కొట్టేయడం సాధ్యం కాదు..
- బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Bombay High Court: ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం.. బిడ్డను తన తల్లి నుంచి వేరు చేయడం ‘‘క్రూరత్వం’’గా పరిగణించబడుతుందని బాంబే హైకోర్టు పేర్కొంది. జల్నాకు చెందిన మహిళ తన అత్తామామలపై నమోదు చేసిన కేసును కొట్టేసేందుకు నిరాకరించింది. ఔరంగాబాద్లోని న్యాయమూర్తుల విభా కంకన్వాడీ, రోహిత్ జోషిలతో కూడా ధర్మాసనం డిసెంబర్ 11న తన ఉత్తర్వుల్లో.. దిగువ కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ మహిళకు, తన నాలుగేళ్ల కూతురని దూరంగా ఉంచుతున్నట్లు గమనించింది.
‘‘నాలుగేళ్ల చిన్నారి తల్లికి దూరంగా ఉంచడం కూడా మానసిక వేధింపులతో సమానం. అది తల్లి మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా గాయపరుస్తుంది. ఇది కూరత్వానికి సమానం’’ అని పేర్కొంది. అత్తమామలపై ఐపీసీ సెక్షన్ 498ఏ కింద క్రూరత్వమే అని చెప్పింది. మానసిక వేధింపులు రోజు రోజుకు కొనసాగుతున్నాయని ఇది తప్పు అని ధర్మాసనం పేర్కొంది. అత్తమామలపై ఎఫ్ఐఆర్ని రద్దు చేయలేమని చెప్పింది.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Bashar al-Assad: సిరియా నుంచి బషర్ అల్ అస్సాద్ని రక్షించిన రష్యా సీక్రెట్ ప్లాన్..
మహారాష్ట్ర జల్నా జిల్లాలో మహిళ తన అత్తామామలు, ఆడపడుచుపై వేధింపుల కేసు పెట్టింది. 2022లో నమోదైన ఈ కేసుని రద్దు చేయాలని వారు కోర్టుని ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. బాధిత మహిళకు 2019లో వివాహం జరిగింది. 2020లో ఒక కుమార్తె జన్మించింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. మే 2022లో సదరు మహిళ అత్తగారి ఇంటి నుంచి బయటకు నెట్టారు. తన కుమార్తెని తీసుకెళ్లడానికి అనుమతించలేదని ఆమె ఆరోపించింది.
దీంతో మహిళ తన బిడ్డను తనకు అప్పగించాలని మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2023లో పిల్లల సంరక్షణ తల్లికి అప్పగించాలని కోర్టు భర్తని ఆదేశించింది. అయితే, భర్త, అతడి కుటుంబీకులు ఈ ఉత్తర్వులను పాటించకుండా, బిడ్డను తన వద్దే ఉంచుకున్నారు. ఈ నేపథ్యంలో బిడ్డ భర్త వద్ద ఉన్నాడని తెలిసీ కూడా మహిళ అత్తమామలు ఆయనకు రహస్యం సహకరిస్తున్నారని బెంజ్ పేర్కొంది. న్యాయశాఖ ఆదేశాలు గౌరవించని వారు ఉపశమనానికి అర్హులు కాదని బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!